Telangana

News April 8, 2024

HYD: ఎస్ఐ రంజిత్‌కి 45 రోజుల రిమాండ్ 

image

లంచం తీసుకుంటూ ఇటీవల ACBకి పట్టుబడిన HYD మాదాపూర్ SI రంజిత్ కుమార్, కానిస్టేబుల్ విక్రమ్‌ను ACB అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి ACB కోర్టులో వారిని హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికీ 45 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు. SI రంజిత్ IIT ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేయడం విశేషం. తర్వాత సివిల్స్ 2 సార్లు రాశారు. మెయిన్స్‌లో విఫలమవగా అనంతరం SI పరీక్షలు రాసి 2020లో జాబ్ పొందాడు. 

News April 8, 2024

BREAKING: HYDలో మరో MURDER  

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ PS పరిధి మురహరిపల్లి హనీ బర్గ్ రిసార్ట్ సమీపంలో బిహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ వాష్మాన్(35)ను బండరాయితో కొట్టి దుండగులు  దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News April 8, 2024

BREAKING: HYDలో మరో MURDER  

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ PS పరిధి మురహరిపల్లి హనీ బర్గ్ రిసార్ట్ సమీపంలో బిహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ వాష్మాన్(35)ను బండరాయితో కొట్టి దుండగులు  దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News April 8, 2024

హనుమకొండ: ఏప్రిల్ 15 నుంచి ఎంఫార్మసీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 15 నుంచి ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 15, 18, 20, 22తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.

News April 8, 2024

సాగర్ ఎడమ కాలువకు నీరు నిలిపివేత

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. ఈనెల 1వ తేదీ నుంచి వారం రోజులపాటు కాలువకు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని తాగునీటి కోసం పెద్దదేవులపల్లి చెరువుతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నింపేందుకు వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.

News April 8, 2024

దేవరకద్ర మార్కెట్‌కు వరుస సెలవులు

image

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు వరుసగా మొత్తం 6 రోజుల పాటు మార్కెట్‌కు సెలవులు వచ్చాయి. ప్రస్తుతం ధాన్యం, ఉల్లి సీజన్‌ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడకుండా సెలవుల జాబితా విడుదల చేసినట్లు మార్కెట్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం అమావాస్య, మంగళవారం ఉగాది, బుధవారం కరి పండుగ, గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు ఉంటాయన్నారు. తిరిగి శనివారం ఒక్కరోజు లావాదేవీలు జరుగుతాయని చెప్పారు.

News April 8, 2024

HYD: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా చికెన్ ధర ప్రస్తుతం రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. మరో వారంలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు.

News April 8, 2024

HYD: భారీగా పెరిగిన చికెన్ ధరలు 

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా చికెన్ ధర ప్రస్తుతం రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. మరో వారంలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు.

News April 8, 2024

HYD: రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం: రోనాల్డ్ రాస్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.1,73,60,502 విలువ జేసే ఇతర వస్తువులు, 19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 8, 2024

HYD: రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం: రోనాల్డ్ రాస్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.1,73,60,502 విలువ జేసే ఇతర వస్తువులు, 19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.