India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి యువతి మృతి చెందిన ఘటన రాజంపేట మండలం షేర్ శంకర్ తండా పరిధిలో చోటుచేసుకుంది. మూడు మామిళ్ల తండాకు చెందిన భూలి(22) స్థానికులతో కలిసి మొర్రి పళ్ళు తెంపడానికి షేర్ శంకర్ తండాకి వచ్చింది. మొర్రి పండ్లు తెంపే క్రమంలో ప్రమాదవ శక్తి కాలు జారీ చెట్టుపై నుంచి కింద పడింది. దీంతో స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందింది.
కాసిపేట మండలంలోని చిన్న ధర్మారంలో ఓ
ఇంటి ముందు కొబ్బరికాయ, పసుపు కుంకుమ, నల్లతాడు, బొమ్మ పెట్టడంతో గ్రామస్థులు భయాందోళనకు గురైయ్యారు. కొందరు వ్యక్తులు కావాలని చేతబడి చేశారని సదరు ఇంటి యజమాని పేర్కొన్నారు. కాగా కొందరు వ్యక్తులు కావాలని ఈ పనికి పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 1-9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్-2) జరగనున్నాయి. వాస్తవానికి ఈ నెల 8 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ సంఘాల, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్షలను 15 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది.
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్లో యాడ్ చూసి, అందులో ఉన్న లింక్ ఓపెన్ చేశాడు. విడతల వారీగా రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
✏GDWL,NRPT&NGKL: పలు గ్రామాల్లో కరెంట్ కట్
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(సోమ)-6:38,సహార్(మంగళ)-4:44
✏నేడు లోక్సభ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
✏నేడు పాలమూరుకు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ రాక
✏ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న ప్రముఖులు
✏పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✏ఉట్కూరు:నేటి నుంచి కాళికామాత జాతర ప్రారంభం
✏దేవరకద్ర:మార్కెట్ యార్డ్ కు వారం రోజులపాటు సెలవు
✏ఎలక్షన్ ఎఫెక్ట్.. పలుచోట్ల తనిఖీలు
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్లో యాడ్ చూసి, అందులో ఉన్న లింక్ ఓపెన్ చేశాడు. విడతల వారీగా రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
విద్యార్థినిని ప్రిన్సిపల్ కొట్టిన ఘటన గంభీరావుపేట మండలంలోని గురుకుల పాఠశాలలో జరిగింది. గ్రామానికి చెందిన ఎడ్ల యశస్విని పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కూతురుని చూద్దామని ఆదివారం తల్లిదండ్రులు పాఠశాలలోకి వెళ్లారు. ఈక్రమంలో భోజనం సరిగా లేదని యశస్విని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ తల్లిదండ్రుల ముందు బిడ్డను కొట్టినట్లు ఆరోపించారు.
కేయూ పరిధిలో ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి తెలిపారు. 16న మొదటి పేపర్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్, 19న స్పోర్ట్స్ మెడిసిన్, 22న హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 24న స్పోర్ట్స్ ఇంజినీరింగ్. పరీక్షల ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయన్నారు.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు మూతలేని నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన HYD జీడిమెట్ల PS పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘాపూర్ వాసి శివకుమార్ షాపూర్నగర్లో నివాసముంటున్నారు. ఆదివారం భార్యాభర్తలు భోజనం చేసి నిద్రపోయారు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి ముందున్న సంపులో పడిపోయింది. కొద్దిసేపటికే అత్త నీటి కోసం వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది. కేసు నమోదైంది.
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు మూతలేని నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన HYD జీడిమెట్ల PS పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘాపూర్ వాసి శివకుమార్ షాపూర్నగర్లో నివాసముంటున్నారు. ఆదివారం భార్యాభర్తలు భోజనం చేసి నిద్రపోయారు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి ముందున్న సంపులో పడిపోయింది. కొద్దిసేపటికే అత్త నీటి కోసం వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.