Telangana

News April 8, 2024

బ్యాక్ లాక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈనెల26 తుది గడువు

image

డా. బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరిన విద్యార్థులు, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు
బ్యాక్ లాక్ పరీక్షల ఫీజు ఈ నెల 26వ తేదీ వరకు చెల్లించాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణగౌడ్ తెలిపారు. విద్యార్థులు తమ సమీప ఆన్లైన్ కేంద్రాల్లో పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలని అన్నారు.

News April 8, 2024

HYD: ప్రారంభానికి నోచుకోని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం

image

రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు వాయిదా పడగా.. ప్రస్తుత ప్రభుత్వమైన TSFTIని ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

News April 8, 2024

HYD: ప్రారంభానికి నోచుకోని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం

image

రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు వాయిదా పడగా.. ప్రస్తుత ప్రభుత్వమైన TSFTIని ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

News April 8, 2024

HYD: మోసం చేసే పార్టీ కాంగ్రెస్: రాణి రుద్రమ దేవి

image

అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని, వంద రోజుల్లో 6 గ్యారంటీలను బొంద పెట్టారని మండిపడ్డారు.

News April 8, 2024

HYD: మోసం చేసే పార్టీ కాంగ్రెస్: రాణి రుద్రమ దేవి 

image

అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని, వంద రోజుల్లో 6 గ్యారంటీలను బొంద పెట్టారని మండిపడ్డారు.

News April 8, 2024

బోధన్: కారులో ఊపిరాడక చిన్నారి మృతి

image

కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. రాకాసిపేటకు చెందిన రాఘవ(6) ఆడుకుంటూ వెళ్లి రోడ్డుపై ఉన్న ఓ కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు తలుపులు బిగుసుకు పోవడంతో ఊపిరి ఆడక కారులోనే మృతి చెందాడు. కారులో చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.

News April 8, 2024

మంచిర్యాల: మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన అధికారి

image

మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన ఘటన మందమర్రి ఏరియా కేకే 5 గనిలో జరిగింది. గని కార్యాలయ సూపరింటెండెంట్‌ అదే ఆఫీస్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగితో తన బూట్లు కడిగించాడు. ఆ అధికారి తీరుతో కలత చెందిన ఆమె ఈ విషయాన్ని పలువురు కార్మికసంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 8, 2024

జహీరాబాద్: గెలుపే లక్ష్యంగా వ్యూహాలు !

image

ZHB లోక్‌సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ముందుకెళ్తుంది. మోదీతోపాటు పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలకు BJP ప్లాన్ చేస్తుంది. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ పోరుకు BRS సన్నద్ధమవుతోంది.

News April 8, 2024

HYD: కాంగ్రెస్‌లోకి డిప్యూటీ మేయర్, 16 మంది కార్పొరేటర్లు

image

HYD పీర్జాదిగూడ, బోడుప్పల్‌ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, 11 మంది BRS కార్పొరేటర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులు, పార్టీ మున్సిపల్ చీఫ్ దయాకర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ఇక బోడుప్పల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు BRS కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

News April 8, 2024

HYD: కాంగ్రెస్‌లోకి డిప్యూటీ మేయర్, 16 మంది కార్పొరేటర్లు

image

HYD పీర్జాదిగూడ, బోడుప్పల్‌ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, 11 మంది BRS కార్పొరేటర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులు, పార్టీ మున్సిపల్ చీఫ్ దయాకర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ఇక బోడుప్పల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు BRS కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.