India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి 18005995991 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ బిల్లుల వివరాలు తెలుసుకునేందుకు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.
మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు RSETI ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూట్ బ్యాగ్ ప్రిపరేషన్, పుట్టగొడుగుల పెంపకం, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ వంటి కోర్సులలో శిక్షణ అందిస్తారు. శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని సంస్థ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ కోరారు.
మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన మహిళా అభ్యర్థుల నుంచి ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీ.నర్సింహరెడ్డి తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్ధులు ఈనెల 15లోగా తమ వివరాలను మెయిల్ చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 7680941504 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్ వాడ జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ జి.శశికళ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈనెల 5న హైదరాబాద్లో ఆమె అవార్డు అందుకొనున్నారు. విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులుగా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎంపికైన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా KNRలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. HZB నుంచి KNRవైపు వచ్చే వాహనాలు మానకొండూరు పల్లె బస్టాండ్ నుంచి ముంజంపల్లి మీదుగా తిమ్మాపూర్ రాజీవ్ రోడ్డుకు చేరుకోవాలి. అక్కడి నుంచి KNR, JGTL నుంచి KNRవైపు వచ్చే వాహనాలను వెలిచాల X రోడ్డు మీదుగా చింతకుంట, పద్మనగర్ X రోడ్డుకు మళ్లిస్తారు. NTR విగ్రహం మీదుగా SRCL బైపాస్ రోడ్డు నుంచి KNR పట్టణానికి డైవర్ట్ చేస్తారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా HYD నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సెప్టెంబర్ 6న శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. బాలాపూర్, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వైపు సాగుతాయని, ఈ ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదన్నారు.
ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీఈటీ కోచ్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. క్లస్టర్, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో స్పోర్ట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచాలని సూచించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. కానీ మిలాద్ ఉన్ నబి పండుగ, గణపతి నిమజ్జనం ఉండడంతో ప్రభుత్వం అధికారిక హాలిడే ప్రకటించింది. దీంతో ఆయా పాఠశాలల్లో ముందస్తుగానే వర్ధన్నపేట ఉప్పరపల్లిలో సర్వేపల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.
Sorry, no posts matched your criteria.