Telangana

News September 27, 2024

MBNR: సీనియర్ అసిస్టెంట్ అశోక్ సూసైడ్.. కారణం ఇదే!

image

గద్వాలలో సీనియర్ అసిస్టెంట్‌ అశోక్ గురువారం ఉరివేసుకున్న విషయం తెలిసిందే. అశోక్ ఇటివలే పెబ్బేరుకు బదిలీ అయ్యారు. ఆర్థిక సమస్యల వల్లే తన భర్త సూసైడ్ చేసుకొని ఉండవచ్చని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై కల్యాణ్‌కుమార్ తెలిపారు. కాగా తాను షేర్ మార్కెట్‌లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఇందులో తన ఫ్రెండ్స్‌వి రూ.20 లక్షలు ఉన్నాయని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News September 27, 2024

పిట్లం: హెల్మెట్ తలకు పెట్టుకోవాలి.. బైక్‌కు కాదు!

image

ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని.. ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు ప్రచారం చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. గురువారం పిట్లంలో ఓ వాహన చోదకుడు తాను వెళ్తున్న వాహనం పై హెల్మెట్ ధరించకుండా.. బైక్ వెనకాల అలంకార ప్రాయంగా తగిలించుకొని వెళ్తున్న దృశ్యమిది.

News September 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వాపురంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల సమ్మె
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} భద్రాచలం గోదావరి వద్ద కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు

News September 27, 2024

కరీంనగర్: రుణమాఫీపై రైతుల ఆందోళన!

image

కరీంనగర్ జిల్లాలో రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.2 లక్షల లోపు రుణం తీసుకొని పలు కారణాలతో మాఫీ కాని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులేమో సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కాగా అర్హులను గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో భాగంగా ఇప్పటివరకు 12 వేలకు పైగా రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణ పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.

News September 27, 2024

కుబీర్: ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం

image

ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన జాదవ్ సాహెబ్ రావు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేసి పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News September 27, 2024

NZB: నేటి నుంచి DSC అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

2008 DSC ద్వారా 70, 30% ఎంపికైన తెలుగు మీడియం SGT అభ్యర్థులకు ఈ నెల 27- అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని NZB DEO దుర్గాప్రసాద్ తెలిపారు. అభ్యర్థులకు సంబంధించిన జాబితాను www.schooledu.telangana.gov.in వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో కూడిన 2 జిరాక్సు సెట్లతో ఉదయం 10:30 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు.

News September 27, 2024

పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లా తీర్చిదిద్దుతాం: తుమ్మల

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటక గుమ్మంగా తీర్చిదిద్దుతామని, ఖమ్మం ఖిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కిల్లా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం సెక్రటేరియట్లో పర్యాటక అభివృద్ధిపై, ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన రోప్ వే పనులపై తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ తో మంత్రి సమావేశమయ్యారు. ఖమ్మం ఖిల్లా పై రోప్ వే నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలన్నారు.

News September 27, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జీవో తెచ్చింది నేనే: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జీవో తెచ్చింది తానేనని, జీవో వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఎంపీ డీకే అరుణ గురువారం అన్నారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితు సరైన న్యాయం చేయలేదన్నారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ అందించాలని ఆమె అన్నారు. సిగ్నల్ గడ్డ వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని ఆమె అన్నారు.

News September 27, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

image

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News September 27, 2024

ఆదిలాబాద్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులు కొనసాగించడానికి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP గౌష్ ఆలం తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో DSP ఆపై స్థాయి అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.