Telangana

News September 9, 2024

అలీ సాగర్ గేట్లను ఏ క్షణమైనా ఎత్తవచ్చు: ఏఈ రాజ్యలక్ష్మి

image

ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఏ క్షణమైన ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నందున ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో దండోరా వేయించాలని ఏఈ రాజ్యలక్ష్మి తెలిపారు.

News September 9, 2024

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకాలు జరపడానికి అర్హులైన అభ్యర్ధుల ‌నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా తెలిపారు. ఇంగ్లీష్ 1, హిస్టరీ 3, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 2,కామర్స్ 2,బి.బి.ఏ 2, బి.సి.ఏ 1, గణితం 3,కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ 3,డేటా సైన్స్ 1, బయోటెక్నాలజీ 1,బాటనీ1ఉన్నాయ. ఈ నెల11నజరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.

News September 8, 2024

భీంపూర్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మహరాష్ట్రలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పిప్పలకోటికి చెందిన జానకొండ నారాయణ(38) గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. కాగా ఇవాళ మహరాష్ట్రలోని అంబాడీ అడవుల్లో అతను కాలిబూడిదై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్యా చేశారా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

News September 8, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు

image

ఓదెల: మాజీ సర్పంచ్ సాగు చేస్తున్న సీలింగ్ భూమిపై ఫిర్యాదు. సిరిసిల్ల: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత! కరీంనగర్: లోయర్ మానేరు డ్యాములో 20.66 టీఎంసీల నీరు నిల్వ. పెద్దపల్లి: బార్డర్ లో రామగుండం యువ జవాన్ అనుమానాస్పద మృతి?. పెద్దపల్లి: అక్రమాలపై యంత్రాంగం ఉక్కు పాదం. రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి. జగిత్యాల: గణనాథుల వద్ద రెండవ రోజు కొనసాగుతున్న భక్తుల కోలాహలం.

News September 8, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

News September 8, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MLG: శివాపూరులో గుండెపోటుతో వృద్ధురాలు మృతి
> BHPL: గణపురంలో పీడీఎస్ బియ్యం పట్టివేత
> MLG: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ
> MHBD: అనారోగ్యంతో సీపీఎం నాయకురాలు మృతి
> MLG: పేరూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
> MHBD: అనారోగ్యంతో జర్నలిస్టు మృతి
> MLG: గ్యాస్ సిలిండర్లు దొంగలిస్తున్న తల్లి కూతుల్లు అరెస్ట్

News September 8, 2024

HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయోలో బంధించాడు

image

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News September 8, 2024

HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయో గదిలో బంధించాడు

image

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News September 8, 2024

HYD: నిమజ్జనానికి కీలక సూచనలు జారీ

image

హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నడుస్తోంది. ఈ క్రమంలో వినాయక నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.
* గణేష్ విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతించబడుతుంది.
* నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్లే వాహనంపై లౌడ్ స్పీకర్ అమర్చకూడదు.* పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలి.

News September 8, 2024

పాలమూరు జిల్లాలో నీట మునిగిన పత్తి పంట వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5.74 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాలకు 2 వేల ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన ప్రారంభించామని వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.