Telangana

News April 7, 2024

నర్సాపూర్: బోర్‌వెల్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ ముందు అతివేగంగా వచ్చిన బోర్‌వెల్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

HYD: రూ.13,13,950 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13,13,950 నగదు, రూ.2,34,159 విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు.

News April 7, 2024

HYD: రూ.13,13,950 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13,13,950 నగదు, రూ.2,34,159 విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు.

News April 7, 2024

మెదక్: రేషన్ బియ్యం పట్టివేత

image

రామయంపేట 44వ జాతీయ రహదారిపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారంతో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి గుజరాత్ వెళ్తున్న ఒక లారీలో 304 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

News April 7, 2024

HYD: అనుమానంతో భార్యను చంపిన భర్త..!

image

భార్యను భర్త హతమార్చిన ఘటన HYD ఉప్పల్ PS పరిధి రామంతాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్‌‌లో శివలక్ష్మి, శివమోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఈ విషయాన్ని కొడుకు సాయి గణేశ్‌కు తెలిపిన శివమోహన్ అనంతరం పరారయ్యాడు. విగత జీవిగా ఉన్న తల్లిని చూసి కుమారుడు విలపించాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

HYD: అనుమానంతో భార్యను చంపిన భర్త..!

image

భార్యను భర్త హతమార్చిన ఘటన HYD ఉప్పల్ PS పరిధి రామంతాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్‌‌లో శివలక్ష్మి, శివమోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఈ విషయాన్ని కొడుకు సాయి గణేశ్‌కు తెలిపిన శివమోహన్ అనంతరం పరారయ్యాడు. విగత జీవిగా ఉన్న తల్లిని చూసి కుమారుడు విలపించాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 7, 2024

HYD: జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన: MLA

image

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు ఐపీఎల్‌ చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందన్నారు.

News April 7, 2024

HYD: జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన: MLA 

image

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు ఐపీఎల్‌ చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందన్నారు. 

News April 7, 2024

అచ్చంపేట: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త మృతి

image

బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి(30)అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వివరాలు.. తన అత్తగారి ఊరైన రంగాపురం గ్రామానికి వెళ్లి వారి ఇంటి ముందు తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందారని తెలిపారు.

News April 7, 2024

KMR: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరు గేటు
వద్ద చోటు చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం..
మాసానిపల్లికి చెందిన గొర్రె నవీన్ (30)కు భార్య, ఇద్దరు పిల్లలు
ఉన్నారు. నిన్న రాత్రి బయటకు వెళ్లిన నవీన్‌ బైక్‌ను గుర్తు తెలియని
మరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి
చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.