Telangana

News April 7, 2024

HYD: పేలిన గ్యాస్ సిలిండర్.. బాలుడి మృతి

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బీజేఆర్ నగర్ పరిధి జ్యోతిరావు కాలనీలో 4 రోజుల క్రితం ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బాలుడు బన్సీ(7)కి తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతిచెందాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదైంది.

News April 7, 2024

మందమర్రి: చికిత్స పొందుతూ సింగరేణి ఉద్యోగి మృతి

image

మందమర్రి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి రామన్ కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఆర్కేపీ ఓసిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న పాయల వెంకటేశ్వర్లు (53) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మందమరి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి తన బైక్ పై వస్తుండగా ఒకసారి అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు..

News April 7, 2024

రామన్నపేట: నామినేషన్‌కు పెన్షన్ డబ్బులు విరాళం

image

రామన్నపేట మండలం మునిపంపుల తన సొంత గ్రామంలో భువనగిరి సీపీఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఓ వృద్ధురాలు తన పెన్షన్ డబ్బులను పోటీలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి తన పెన్షన్ డబ్బులను విరాళంగా అందజేశారు. పార్టీలకు అతీతంగా సీపీఎం పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేశారు.

News April 7, 2024

HYD: పేలిన గ్యాస్ సిలిండర్.. బాలుడి మృతి 

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బీజేఆర్ నగర్ పరిధి జ్యోతిరావు కాలనీలో 4 రోజుల క్రితం ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బాలుడు బన్సీ(7)కి తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతిచెందాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదైంది.

News April 7, 2024

సంగారెడ్డి: పెరుగుతున్న కోతుల బెడద

image

జిన్నారం మండల పరిధిలోని మాదారం, కొడకంచి, శివనగర్, ఊట్ల, రాళ్లకత్వ, గడ్డపోతారం, వావిలాల తదితర గ్రామాలలో రోజురోజుకీ కోతుల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా కోతుల గుంపు రోడ్లపై తిష్ట వేసి వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తున్నాయి. కోతులు ఇళ్లల్లోకి చొరబడి చాలా మందిపై కోతులు దాడులు చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ పాలకులు సమస్యను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు.

News April 7, 2024

NZBలో ఒకే వేదికపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

image

నిజామాబాద్ బస్వా గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ప్రత్యర్థి పార్టీల MP అభ్యర్థులు వేదికను పంచుకున్నారు. ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, అర్బన్, రూరల్ MLAలతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకునే నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

News April 7, 2024

HYD: ఉద్యమకారుడు పద్మారావుగౌడ్‌ను గెలిపిద్దాం: MLA

image

తెలంగాణ ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్‌ను గెలిపిద్దామని జూబ్లీహిల్స్ MLA, BRS పార్టీ HYD జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈరోజు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో BRS సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2024

HYD: ఉద్యమకారుడు పద్మారావుగౌడ్‌ను గెలిపిద్దాం: MLA

image

తెలంగాణ ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్‌ను గెలిపిద్దామని జూబ్లీహిల్స్ MLA, BRS పార్టీ HYD జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈరోజు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో BRS సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2024

తాండూరు: UPDATE: హత్యకు గురైన మహిళ గుర్తింపు

image

తాండూరులోని బీసీ శ్మశానవాటికలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కోస్గి మం.గుండుమల్‌కు చెందిన తిరుపతమ్మ(40)ని పదేళ్ల క్రితం భర్త వదిలేశాడు. తాండూరులోని తన అక్క ఇంట్లో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తుంది. శుక్రవారం పనికి వెళ్ళిన తిరుపతమ్మ ఇంటికి రాలేదు. శనివారం మృతదేహం గుర్తించిన పోలీసులు సుజాత సోదరికి సమాచారం అందించారు.

News April 7, 2024

KU: 16 నుంచి LLB సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 5 ఏళ్ల కోర్సు మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు, మూడు ఏళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులు) పరీక్షలు ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి వెల్లడించారు.