Telangana

News April 7, 2024

హైదరాబాద్: UPDATE: గన్‌తో కాల్చుకొని AR SI సూసైడ్?

image

ఓల్డ్‌ సిటీలోని‌ కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్‌ (48)‌ విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్‌ గన్‌తో సూసైడ్‌ చేసుకొన్నారు.‌ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని‌ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య‌కు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

News April 7, 2024

సంగారెడ్డి: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుజల్పూర్ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. 50-60 మధ్య వయస్సు గల మహిళగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో మతి స్థిమితం కోల్పోయి తిరుగుతుండగా స్థానికులు చూసినట్లు తెలిపారు. వివరాలు ఎవరికైనా తెలిస్తే ఖేడ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డి చెప్పారు.

News April 7, 2024

ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం దక్కేదెవరికి?

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ 5 పార్టీలను ఆదరించారు. 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, స్వతంత్ర, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కోసారి గెలిచాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ MP అర్వింద్ ధర్మపురి మరోసారి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 7, 2024

ములుగు: జీతం అడిగినందుకు గేదెల కాపరిపై దాడి

image

గేదెలు కాసినందుకు జీతం డబ్బులు అడిగిన కాపరిపై యజమాని దాడి చేసిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగింది. బాధితుడు దుర్గం దుర్గయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పనపల్లికి చెందిన యజమాని అంజయ్యకు చెందిన గేదెలను కాసిన డబ్బులు ఇవ్వాలని అడగగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అంజయ్య కర్రతో దుర్గయ్యపై దాడి చేశాడు. కాగా అంజయ్యపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

News April 7, 2024

రెండు నెలలు మరింత ఉష్ణోగ్రత… అప్రమత్తతే ముఖ్యం

image

ఖమ్మం జిల్లా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లో ఉంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు నెలల్లో ఉష్ణోగ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నందున అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు తమ పనులను కూడా వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలని చెబుతున్నారు.

News April 7, 2024

కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు ఆదివారం కావడంతో మల్లన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్నకు బోనాలు, పట్నాలు, గంగిరేగు చెట్టుకు ముడుపులు, ప్రదక్షిణలు, అభిషేకం, అర్చనలు చేస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు.

News April 7, 2024

ఈసారి నిజామాబాద్ ఎంపీ స్థానం దక్కేదెవరికి?

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఓటర్లు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇక్కడ 5 పార్టీలను ఆదరించారు. 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు టీడీపీ, స్వతంత్ర, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కోసారి గెలిచాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ MP అర్వింద్ ధర్మపురి మరోసారి బరిలో నిలవగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. గెలుపుపై ముగ్గురూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 7, 2024

మద్యం అమ్మకాల్లో మంచిర్యాల టాప్..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతేడాదితో పోల్చితే 5 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి. ఆదిలాబాద్‌లో రూ.385.58, ఆసిఫాబాద్‌లో రూ.269.99, మంచిర్యాలలో రూ.703,6, నిర్మల్‌లో రూ.448.83 లక్షల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మొత్తం గతేడాది రూ.1,716.60కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడు రూ.1,807.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాలలో అత్యధిక అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.

News April 7, 2024

NZB: చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

image

చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన NZB జిల్లాలోని సాలూరాలో చోటుచేసుకుంది. మండలానికి చెందని గాదే మనోజ్(23), గోరంట్ల మనోజ్(19) శనివారం సాయంత్రం చెరువులోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోగా అతడిని కాపాడే క్రమంలో మరో యువకుడు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News April 7, 2024

20 రోజుల వ్యవధిలో 20 మంది మావోయిస్టులు మృతి

image

ఆకు రాలే కాలం వచ్చిందంటే అడవుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతోంది. 20 రోజుల వ్యవధిలోనే 20 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. చత్తీస్‌గఢ్ గడ్చిరోలిలో 13 మంది మృతి చెందగా.. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు చనిపోయారు. తాజాగా శనివారం తెలంగాణ సరిహద్దు పూజారికాంకేర్ కర్రిగుట్టల(ములుగు జిల్లా) అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.