Telangana

News April 7, 2024

ఖమ్మం: ఆర్టీసీ ఉద్యోగులకు వడదెబ్బ ముప్పు

image

వేసవిలో ఎండల తాకిడికి ప్రజలు అల్లాడుతున్నారు. అయితే నీడ పట్టున ఉండి పని చేసే వారికి సమస్య తీవ్రత తక్కువగా ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం భానుడి ప్రతాపాన్ని ఎదుర్కొంటూనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావాల్సిందే. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా కాపాడకోవాలని అధికారులు సూచిస్తున్నారు

News April 7, 2024

NZB: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు, పురుషులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్త తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు డిచ్‌పల్లి SBI స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News April 7, 2024

భద్రాద్రి రామయ్య కల్యాణానికి 250 క్వింటాళ్ల తలంబ్రాలు

image

భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పంపిణీ చేసేందుకు గతేడాది 150 క్వింటాళ్ల తలంబ్రాలు తయారుచేయగా, ఈ ఏడాది 250 క్వింటాళ్లకు పెంచుతున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం తెలిపారు. పంపిణీకి 60 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 600 బస్సుల్లో 600 కేజీలు పంచనున్నట్లు చెప్పారు. ప్రసాదాలు పోస్టల్ ద్వారా విక్రయిస్తుండగా, తలంబ్రాలు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News April 7, 2024

KMM: ఈనెల 30 వరకు చెల్లిస్తే 5% శాతం తగ్గింపు

image

ఖమ్మంలో ఈనెల 30వరకు 5 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించే అవకాశం ఉందని మున్సిపాలిటీలోని మీసేవా కేంద్రం వద్ద కానీ, బిల్ కలెక్టర్‌కు లేదా CDMA.telangana.govt.in ద్వారా ఆన్లైన్ లో చెల్లించవచ్చని కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. షాపింగ్ మాల్స్ ఓనర్లు తప్పనిసరి ట్రేడ్ లైసెన్స్ పొందాలన్నారు. గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు.

News April 7, 2024

HYD: అన్నం వండలేదని చంపేశారు

image

HYDలో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ వాసి హన్స్‌రామ్(38) కుత్బుల్లాపూర్‌లో ఉంటున్నాడు. భార్య 2 నెలల క్రితం ఊరెళ్లింది. నాటినుంచి జీడిమెట్లలోని బినయ్‌సింగ్ గదిలో ఉంటున్నాడు. మంగళవారం అన్నం వండలేదని బినయ్‌సింగ్‌ను అదే గదిలో ఉండే సందీప్, సోను మద్యం మత్తులో కొట్టారు. హన్స్‌రామ్‌నూ విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 7, 2024

HYD: అన్నం వండలేదని చంపేశారు

image

HYDలో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ వాసి హన్స్‌రామ్(38) కుత్బుల్లాపూర్‌లో ఉంటున్నాడు. భార్య 2 నెలల క్రితం ఊరెళ్లింది. నాటినుంచి జీడిమెట్లలోని బినయ్‌సింగ్ గదిలో ఉంటున్నాడు. మంగళవారం అన్నం వండలేదని బినయ్‌సింగ్‌ను అదే గదిలో ఉండే సందీప్, సోను మద్యం మత్తులో కొట్టారు. హన్స్‌రామ్‌నూ విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏GDWL& మద్దూర్: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్  ✏త్రాగునీటి సమస్యలపై అధికారుల చర్యలు ✏పలు నియోజకవర్గంలో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు ✏కల్వకుర్తి: నేడు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ✏ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’ ఏర్పాటు& చలివేంద్రాలు ప్రారంభించనున్న అధికారులు ✏నేడు, రేపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ✏పకడ్బందీగా కొనుగోలు కేంద్రాలు.. అధికారుల ఫోకస్ ✏కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

News April 7, 2024

నేడు ఐనవోలు మల్లన్న ఆలయంలో పెద్దపట్నం

image

ఐనవోలు మల్లికార్జునస్వామి అలయంలో ఆదివారం పెద్దపట్నంను వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రానుండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలోనే అత్యంత పెద్దపట్నం వేస్తున్నట్లు ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 100 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నట్లు పర్వతగిరి సీఐ శ్రీనివాస్ తెలిపారు.

News April 7, 2024

ADB: ఉమ్మడి జిల్లాలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం గరిష్ఠంగా మంచిర్యాల జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 41, ఆదిలాబాద్ 42.4, నిర్మల్ 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News April 7, 2024

నాగిరెడ్డిపేట: కుటుంబ కలహలతో వివాహిత ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగిరెడ్డిపేట మండలం బంజర తండా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా తండాకు చెందిన ధరావత్ వినోద్‌, అరుణ (32)లకు ముగ్గురు కుమారులున్నారు. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవపడుతుండేవారు. కుటుంబీకులు నచ్చచెప్పాలని ప్రయత్నించినా వినకుండా క్షణికావేశంలో అరుణ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.