Telangana

News April 7, 2024

ఖమ్మం: నడిచివెళ్తుండగా వాహనం ఢీకొట్టి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం కాశీపట్నం వద్ద శనివారం జరిగింది. పిండిప్రోలుకి చెందిన ఐతనబోయిన వెంకటేశ్వర్లు(68) కాశీపట్నంలోని దేవాలయం వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రహదారిపై నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 7, 2024

‘బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ బాధ్యత’ అంటూ ప్రకటన

image

బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, ములుగు ఎస్సీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అని భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నామన్నారు.

News April 7, 2024

నేటితో నిట్‌లో ముగియనున్న వేడుకలు

image

నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకల్లో శనివారం రెండో రోజు కల్చరల్ ఫెస్ట్ కలర్ ఫుల్‌గా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా 35కు పైగా ఈవెంట్లలో పాల్గొన్నారు. కాగా మూడు రోజుల వసంతోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి సీతారామం సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో నవదీప్ హాజరు కానున్నారు.

News April 7, 2024

ఓయూ: ఇంటర్, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

image

ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు పర్యటన
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో రుద్రాభిషేకం
✓కొత్తగూడెంణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓కరకగూడెం మండలంలో ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన

News April 7, 2024

NLG: భానుడు @ 44.5 డిగ్రీలు…!

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం వేళల్లో సైతం ఎండల ధాటికి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడిమి తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం నాంపల్లి, పెన్‌పహాడ్ ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి నుంచి రక్షించుకునే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News April 7, 2024

ఆదిలాబాద్: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

నేరడిగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అత్యాచారయత్నం చేసినట్లు ఏఎస్ఐ మారుతి తెలిపారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం చేయగా బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పరారైనట్లు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 7, 2024

ఓయూ: ఇంటర్, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

image

ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 7, 2024

ఓయూ: ఇంటర్, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

image

ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 7, 2024

ఖమ్మం: మద్యం మత్తులో పాఠశాల గదికి నిప్పు

image

నేలకొండపల్లి మండలం బైరవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని స్టోర్ గదికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. శనివారం మధ్యాహ్న భోజనం వండేందుకు వచ్చిన నిర్వాహకులు గది తలుపులు తీయగా ఈ విషయం బయటపడింది. దీంతో HM కోటేశ్వరరావు పరిశీలించగా.. సమీపాన మద్యం సీసాలు, సిగరెట్ పీకలు ఉండడంతో ఆకతాయిలు మద్యం తాగిన మైకంలో స్టోర్ గది కిటికీలో నుంచి నిప్పు వేసినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.