Telangana

News April 6, 2024

MBNR: ‘ఔట్ సోర్సింగ్ వర్కర్లపై వేధింపులు ఆపాలి’

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రభుత్వ కళాశాలల వసతి గృహాలలో ఔట్ సోర్సింగ్‌పై ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నారు. వారిపై వార్డెన్స్ పెత్తనం చెలాయిస్తూ తమని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అందుకుగాను శనివారం జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ మోహన్ రావు‌కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆధిపత్య భావజాలాన్ని అణగదొక్కాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News April 6, 2024

NLG: బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.. తీవ్ర గాయాలు

image

చిట్యాల మున్సిపాలిటీలోని సంతోష్ నగర్ కాలనీలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ డీఎస్సీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఇంటిని కిరాయికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన కోటేశ్వరరావు బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

News April 6, 2024

‘రైతులు ఏడుస్తుంటే క్రికెట్ ముఖ్యమా రేవంత్ రెడ్డి..?’

image

‘ఆరుగాలం కష్టించి సాగు చేస్తున్న పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే నీవు క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తావా..!’ అంటూ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై స్థానిక కార్యాలయ ప్రాంగణంలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎండిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

News April 6, 2024

HYD: డిగ్రీతో పాటు మిలిటరీ ట్రైనింగ్.. మీ కోసమే..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని యువతులకు గురుకులాల అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. MA(ఎకనామిక్స్)+మిలిటరీ ట్రైనింగ్ అందించనున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా.. మిగతా వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్ చూడాలని HYD గురుకులాల అధికారులు Xలో ట్వీట్ చేశారు.

News April 6, 2024

HYD: డిగ్రీతో పాటు మిలిటరీ ట్రైనింగ్.. మీ కోసమే..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని యువతులకు గురుకులాల అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. MA(ఎకనామిక్స్)+మిలిటరీ ట్రైనింగ్ అందించనున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా.. మిగతా వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్ చూడాలని HYD గురుకులాల అధికారులు Xలో ట్వీట్ చేశారు. 

News April 6, 2024

నేతన్న కుటుంబానికి రూ.50,000 ఆర్థికసాయం చేసిన కేటీఆర్

image

సిరిసిల్లలో ఉరేసుకుని<<13002333>> లక్ష్మీనారాయణ<<>> అనే నేత కార్మికుడు మృతి చెందాడు. ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తక్షణ సహాయం కింద రూ. 50,000 ఆర్థికసాయం చేశారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థికసాయమందించాలని కలెక్టర్‌ను కోరారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News April 6, 2024

మల్కాజిగిరి పార్లమెంట్‌లో సమన్వయకర్తలు వీరే!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని BRS పార్టీ అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది.
✏మేడ్చల్-శంభీపూర్ రాజు(MLC)
✏మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్
✏కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు
✏కూకట్‌పల్లి-బేతిరెడ్డి సుభాష్ రెడ్డి
✏ఉప్పల్-జహంగీర్ పాషా
✏సికింద్రాబాద్ కంటోన్మెంట్ -రావుల శ్రీధర్ రెడ్డి
✏ఎల్బీనగర్ -బొగ్గరపు దయానంద్ గుప్తా(MLC)

News April 6, 2024

జనగామ: కరెంట్ పనులు చేస్తుండగా.. షాక్‌తో మృతి

image

విద్యుత్తు పనులు చేస్తుండగా షాక్‌తో వ్యక్తి మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. తీగారం గ్రామానికి చెందిన బైకాని శ్రీశైలం శనివారం ముత్తారం గ్రామశివారులో విద్యుత్తు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌తో మరణించాడు. ఇతను వల్మిడిలో విద్యుత్తు కట్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

NLG: ఆదర్శ పాఠశాలలో పరీక్ష తేదీల ఖరారు

image

మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 7న ఆన్ లైన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10గం.ల నుంచి 12గం.ల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2గంల నుంచి 4గం.ల వరకు 7- 10వ తరగతుల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ స్వరూప రాణి తెలిపారు.

News April 6, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు చల్లటి కబురు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.