Telangana

News April 6, 2024

HYD: KCR హయాంలోనే అభివృద్ధి జరిగింది: రాగిడి

image

HYD నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్‌లో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రాగిడి మాట్లాడుతూ.. KCR హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ పాల్గొన్నారు.

News April 6, 2024

HYD: KCR హయాంలోనే అభివృద్ధి జరిగింది: రాగిడి

image

HYD నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్‌లో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రాగిడి మాట్లాడుతూ.. KCR హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ పాల్గొన్నారు.

News April 6, 2024

MBNR: మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేయుటకు అర్హులైన స్థానిక అభ్యర్థుల నుండి సెలక్షన్ కమిటీ దరఖాస్తులను కోరింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న 11 డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 3 ల్యాబ్ అటెండెంట్‌లు, 9 ఆఫీస్ సబార్డినేట్లు, 1 థియేటర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ ఉన్నాయి. 18- 45 వయసు లోపు స్థానిక అభ్యర్థులు జిల్లా ఉపాది కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని కోరారు.

News April 6, 2024

భువనగిరి: రైలు కిందపడి యువకుడు మృతి

image

భువనగిరి మున్సిపాలిటీ టీచర్స్ కాలనీ సమీపాన రైల్వే ట్రాక్ పై రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తెల్జీరి చిన్న యాదవ్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లుగా రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

News April 6, 2024

దేశంలోనే మొదటి కళాశాల మన సంగారెడ్డిలో..

image

గిరిజన విద్యార్థులు న్యాయ విద్యలో రాణించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ప్రత్యేకంగా న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన లా కళాశాలను మూడేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే ఏర్పడిన మొదటి ఎస్టీ గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇంటర్మీడియట్‌ అర్హతతో లాసెట్‌ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లలో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసేందుకు వీలుంటుంది.

News April 6, 2024

మహిళ ఉద్యోగిపై సెక్రటరీ వేధింపులు

image

తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మహిళ పనిచేస్తుండగా.. అందులో సెక్రటరీగా పనిచేస్తున్న వెలుగు మురళి వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్నిరోజులుగా మహిళపై మనసుపడ్డానని మురళి ఆమెను వేధించేవాడు. తాజాగా అవి ఎక్కువవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో మురళిపై SC, ST కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు.

News April 6, 2024

గడ్డ పార పట్టి శ్రమదానం చేసిన కామారెడ్డి కలెక్టర్

image

ప్రాచీన కట్టడాలను పునరుద్ధరించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన బావిలో పూడిక తీస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. యువకులు శ్రమదాన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు.

News April 6, 2024

SR నగర్‌లో యువతిని ఢీకొట్టింది ఇతనే..!

image

HYD SR నగర్‌లో ఓ <<13001120>>యువతి స్కూటీని ముగ్గురు<<>> టీనేజర్లు బైక్‌తో ఢీకొట్టగా ఆమె కాలు విరిగి, తలకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఆ ముగ్గురు టీనేజర్లు వెళ్లిపోతుండగా స్థానికులు వారిని వెంబడించి పట్టుకున్నారు. స్పీడ్‌గా బైక్ నడిపిన వ్యక్తిని మందలించారు. కాగా ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అబ్బాయిలకు సైతం గాయాలయ్యాయి. యువతితో పాటు వారిని కూడా ఆస్పత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.

News April 6, 2024

SR నగర్‌లో యువతిని ఢీకొట్టింది ఇతనే..!

image

HYD SR నగర్‌లో ఓ <<13001120>>యువతి స్కూటీని ముగ్గురు<<>> టీనేజర్లు బైక్‌తో ఢీకొట్టగా ఆమె కాలు విరిగి, తలకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఆ ముగ్గురు టీనేజర్లు వెళ్లిపోతుండగా స్థానికులు వారిని వెంబడించి పట్టుకున్నారు. స్పీడ్‌గా బైక్ నడిపిన వ్యక్తిని మందలించారు. కాగా ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అబ్బాయిలకు సైతం గాయాలయ్యాయి. యువతితో పాటు వారిని కూడా ఆస్పత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.

News April 6, 2024

కోరుట్ల: ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి

image

తాగునీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణంలో శనివారం జరిగింది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిసింద్ర, అపూర్వల కుమారుడైన సుధన్వన్.. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి బాలుడిని ఢీకొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.