Telangana

News April 5, 2024

HYD: పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత

image

హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేయగా కారులో నుంచి రూ.40 లక్షలు నగదు బయటపడింది. ఇద్దరు వ్యక్తుల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి, నగదును సీజ్ చేసినట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.

News April 5, 2024

HYD: పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత

image

హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ వద్ద పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఓ కారును ఆపి తనిఖీ చేయగా కారులో నుంచి రూ.40 లక్షలు నగదు బయటపడింది. ఇద్దరు వ్యక్తుల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి, నగదును సీజ్ చేసినట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.

News April 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. @ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్. @ మల్లాపూర్ మండలంలో వ్యక్తి దారుణ హత్య. @ మేడిపల్లి మండలంలో అనుమానాస్పద స్థితిలో వలస కూలి మృతి. @ కథలాపూర్ మండలంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగల అరెస్ట్. @ మెట్పల్లి మండలంలో సైబర్ మోసంతో నగదు తస్కరణ. @ జగిత్యాలలో 15 తులాల బంగారు నగలు చోరీ.

News April 5, 2024

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు.

News April 5, 2024

HYD: KCR అలా.. రేవంత్‌రెడ్డి ఇలా: రాగిడి లక్ష్మారెడ్డి

image

BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

News April 5, 2024

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల 

image

2023 డిసెంబరులో నిర్వహించిన కేయూ డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి.ఎస్.సి/బిబిఎ/హనర్స్/వొకేషనల్) 1వ, 3వ,5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ రమేశ్ విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24.41% ఉత్తీర్ణత, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 30%, 5వ సెమిస్టర్ పరీక్షల్లో 44.45% ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. వివరాలకు www.kakatiya.ac.inలో చూడవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి తెలిపారు. 

News April 5, 2024

HYD: KCR అలా.. రేవంత్‌రెడ్డి ఇలా: రాగిడి లక్ష్మారెడ్డి 

image

BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. 

News April 5, 2024

ఖమ్మం: చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య

image

చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నగరంలోని బల్లేపల్లిలో నివాసం ఉంటున్న వినయ్ (27) మార్బుల్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఖానాపురం పోలీస్ స్టేషన్ సీఐ భాను ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

HYD నగరానికి నీళ్ల ఢోకా లేకుండా PLAN

image

HYD నగరంలో నీళ్ల ఢోకా లేకుండా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నగరానికి నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూర్, హిమాయత్‌ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే రోజుకు దాదాపు 140 మిలియన్ లీటర్ల నీరు అధికంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి సాగర్, మే ఒకటి నుంచి ఎల్లంపల్లి ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

News April 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ‘TOP NEWS’

image

♥ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
♥GDWL: బొలెరో బోల్తా.. ఇద్దరు మృతి
♥కల్వకుర్తి: యాక్సిడెంట్‌లో టీచర్ మృతి
♥NRPT: వ్యక్తి దారుణ హత్య.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
♥కాంగ్రెస్‌పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు: గువ్వల
♥WNPT: రేపు 5K రన్
♥ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు:MRPS
♥CSK-HYD మ్యాచ్ చూసేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా నేతలు