Telangana

News September 8, 2024

కాంగ్రెస్ పాలనలో 475 మంది రైతుల ఆత్మహత్య: హరీష్ రావు

image

కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారని, కాని రైతులు రుణమాఫీ కాక తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

News September 8, 2024

ఘట్‌కేసర్: రైలు కింద పడి కానిస్టేబుల్ సూసైడ్

image

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నరసింహరాజు ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News September 8, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. తరలివస్తున్న పర్యాటకులు

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో సాగర్ గేట్లు, జల విద్యుత్ కేంద్రం, ఎత్తిపోతల జలపాతం, నాగార్జునకొండ తదితర ప్రాంతాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News September 8, 2024

వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి

image

ప్రకృతి వైపరిత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నారు. ఆదివారం ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1,300 కోట్లు పంపిందని, వరదపై రాజకీయం చేయడం సరికాదన్నారు.

News September 8, 2024

లోయర్ మానేరుకు నీరు విడుదల

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు డ్యామ్‌లో 27.54 టీఎంసీలకు గాను.. 23.908 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో మధ్యాహ్నం దిగువ ఉన్న లోయర్ మానేరు డ్యామ్‌లోనికి 10వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 15,800 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 20.750 క్యూసెక్కుల నీటిని అధికారులు ఎమ్మెల్టీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

News September 8, 2024

ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలో పలు వార్డులలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వినాయకుని మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

News September 8, 2024

దీప్తిని సన్మానించిన మంత్రి సీతక్క

image

పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన దీప్తి జీవంజిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. వరంగల్ జిల్లాకు చెందిన దీప్తి పథకం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీతక్క అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

News September 8, 2024

మిడ్ మానేరుతో నిర్వాసితులకు ఉపాధి!

image

మధ్యమానేరు నిర్వాసితులు మిడ్ మానేరులో చేపలు పడుతూ ఆర్థికంగా స్థిరపడ్డారు. మధ్యమానేరు నిర్మాణంతో సర్వం కోల్పోయి పునరావాస గ్రామాలకు తరలిన మత్స్యకారులు అదే ప్రాజెక్టును ఉపాధికి నిలయంగా మార్చుకున్నారు. హైదరాబాద్ వంటి పట్టణాలకు చేపలు తరలిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. దాదాపు 1500 మంది చేపలు పట్టేందుకు లైసెన్స్ పొందారు.

News September 8, 2024

ములుగు: విపత్తుతో నేల కూలీల చెట్లు.. పర్యాటక ప్రాంతంగా మారింది!

image

తాడ్వాయి-మేడారం అడవుల్లో కొన్ని రోజుల క్రితం విపత్తు కారణంగా వేల చెట్లు నేలకొరిగాయి. ఇప్పుడు ఆ ప్రాంతం చెట్లను కోల్పోయి వెలవెలబోతోంది. విపత్తు కారణంగా నేలకూలిన చెట్లను చూడటానికి చుట్టుపక్కల మండల ప్రజలు, విద్యార్థులు, మేడారం దర్శనం కోసం వచ్చే భక్తులు పర్యాటక ప్రాంతంగా తరలివచ్చి వీక్షిస్తున్నారు. అందరూ సెల్ ఫోన్లో చిత్రీకరించుకుంటున్నారు. ఎప్పుడు ఇంతటి విపత్తు చూడలేదని వారు తెలిపారు.

News September 8, 2024

గద్వాల: నీటి గుంతలో పడి పదేళ్ల బాలుడి మృతి

image

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.