India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ MP అభ్యర్థి కోసం BRS కసరత్తు చేస్తుంది. మొదట్లో కడియం కావ్యకు టికెట్ ఇవ్వగా నిరాకరించి హస్తం గూటికి చేరారు. దీంతో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి BRSలో ఏర్పడింది. మాజీ MLA తాటికొండ రాజయ్యని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ నుంచి పోటీకి దింపాలని BRS నేతలు మంతనాలు జరుపుతున్నారు. అలాగే మాజీ MLA పెద్ది సుదర్శన్ సతీమణి స్వప్న, జోరిక రమేశ్ టికెట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఓ వేడుకలో సరదాగా మాట్లాడుకున్నారు. కోరుట్లలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సింగరావు హాజరయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడికి రావడంతో అందరూ కలుసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1నుంచి 9తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎస్ఏ-2 (వార్షిక) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. రెండో సారి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈనెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. గురువారం దీన్ని మారుస్తూ.. కొత్త తేదీలను ప్రకటించింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.6 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ నుంచి బాదల్ గావ్ చౌరస్తా వద్ద ఎస్ఐ తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఈ నగదు లభ్యమైంది. సంగారెడ్డిలోని గ్రీవెన్స్లో డిపాజిట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంట్లోకి చొరబడి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
గంజాయి తాగొద్దన్నందుకు తండ్రిపై కుమారుడు పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన RR జిల్లా తుర్కయంజాల్లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులకు వివరాల ప్రకారం.. కొల్లాపూర్కు చెందిన రవీందర్(60)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనురాగ్ గంజాయికి బానిసయ్యాడు. గంజాయి తాగొద్దని మందలించడంతో, పెట్రోల్ పోసి, బండరాయితో మోది తండ్రిని హత్య చేశాడు. పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేశారు.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.
తెలంగాణ హైకోర్టు తీర్పుతో వరంగల్ RDO ఆఫీసును అధికారులు జప్తు చేశారు. గీసుకొండ మండలం శాయంపేట సమీపంలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ కోసం భూమి ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం అందలేదు. దీనిపై రైతు సముద్రాల స్వామి, అతడి కూతురు వెన్నెల హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం ఇవ్వాలని గతంలో ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడంతో RDO ఆఫీసు జప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 120 మంది సిబ్బందితో ట్రాకింగ్ నిర్వహిస్తున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో సంచరిస్తున్న ఏనుగును కెమెరాలో బంధించారు. ఇప్పటికే జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు అటవీ అధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేటలో జరిగింది. రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. రాయినిగూడెం సెవెన్ స్టార్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని గుర్తిస్తే సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో తెలియజేయలన్నారు. 8712686006, 8712683060 నంబర్లను సంప్రదించాలని ఎస్సై బాలునాయక్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.