Telangana

News April 5, 2024

ఖమ్మం: లవ్‌ ఫెయిల్.. డెలివరీ బాయ్ సూసైడ్

image

ప్రేమ విఫలమై జీవితంపై విరక్తి చెందిన ఓ డెలివరీ బాయ్ సూసైడ్ చేసుకొన్న ఘటన HYD కూకట్‌పల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరుకు చెందిన షేక్ షాజహాన్(30) భాగ్యనగర్‌కాలనీలో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అతడి ప్రేమను అమ్మాయి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉరివేసుకొన్నాడు.

News April 5, 2024

కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: MLA

image

కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలేరు మండలంలోని షోడషపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారిన నేతలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

News April 5, 2024

పార్టీ మారే ప్రసక్తే లేదు: గంగుల

image

కరీంనగర్ MLA, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పార్టీ మారుతున్నారనే పలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. గురువారం ఆయన కరీంనగర్‌లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు బురద జల్లుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనకే రైతులు ఆగమయ్యారని, వారిని ఆదుకునేందుకే కేసీఆర్ రంగంలోకి దిగారని తెలిపారు.

News April 5, 2024

హైదరాబాద్‌లో బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటు నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు.

News April 5, 2024

సంగారెడ్డి: లోన్ యాప్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య

image

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఓ గ్రామంలో లోన్ యాప్ వేధింపులతో మనస్తాపానికి గురై యువకుడు శ్రీకాంత్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ ద్వారా రూ.30 వేల రుణం తీసుకోగా, నాలుగు నెలల వ్యవధిలో రూ.1,30,000 చెల్లించాడు. మరో రూ.80వేలు చెల్లించాలని వేధించారు. అశ్లీల పోస్టులు చేయడంతో మనస్తాపానికి గురై గత నెల 30న పురుగు మందు తాగాడు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

News April 5, 2024

HYD: వేసవి జాగ్రత్తలు!

image

✓రోజుకి కనీసం 4 లీటర్ల నీళ్లు తాగండి.
✓ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో తిరగవద్దు.
✓వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి.
✓షుగర్,బీపీ పేషెంట్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.
✓వాంతులు, విరోచనాలు జరిగితే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
✓సొంత వైద్యం ఏ మాత్రం మంచిది కాదు.
✓వేసవిలో మద్యం శరీరానికి మరింత ముప్పు చేస్తుంది.
•HYD గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

News April 5, 2024

జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్ ప్రియాంక అల

image

జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. శిశు మరణాలపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని, చిన్న పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని పీహెచ్సీకి తరలించాలని సూచించారు. డీఎంహెచ్ఓ జీవీఎల్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, డీఐఈఓ బాలాజీ, సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నర్సింహారావు తదితరులతో సమీక్ష నిర్వహించారు.

News April 5, 2024

హైదరాబాద్‌లో బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటు నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు.

News April 5, 2024

కొత్తగూడెం: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై దాడి

image

ములకలపల్లి మండలం చింతలపాడులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ పూరపై దాడి చేశారు. వివరాలిలా.. విధి నిర్వహణలో భాగంగా పూర ధర్మన్న సాగర్ శివారు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆదివాసీలు తమ పంటలకు అడవిలోని కుంట నీళ్లు వాడుతుండడంతో అధికారి మందలించారు. దీంతో ఆయన తలపై పారతో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రాజమౌళి కేసు నమోదు చేశారు.

News April 5, 2024

ఖమ్మం: రైతుకు పాము కాటు

image

నేలకొండపల్లి మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు పూజల సీతారాములును పొలం దగ్గర పాము కాటేసింది. సమీపంలోని రైతులు ఆయనను నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.