Telangana

News April 4, 2024

పోలీసుల కస్టడీలో కరీంనగర్ కార్పొరేటర్ భర్త

image

భూ వివాదంలో కరీంనగర్ 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాశ్‌ను గత నెల 26న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. కోర్టు ద్వారా పోలీసులు 24 గంటల కస్టడీ తీసుకున్నామని కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రకాశ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

News April 4, 2024

ఖమ్మం: పనిచేస్తూనే కుప్పకూలి మహిళ మృతి

image

ఇంటి వద్ద పనిచేసుకుంటున్న ఓ మహిళ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నేలకొండపల్లిలో బుధవారం జరిగింది. సుజాత(57) బుధవారం ఇంటి వద్ద పనిచేసుకుంటోంది . ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News April 4, 2024

మరికొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు మృతి

image

మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు చనిపోయిన ఘటన రామన్నపేట మం. కక్కిరేణిలో జరిగింది. యాదయ్య, అంజమ్మ దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌కు ఉత్తటూరుకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. కాగా నవీన్ నిన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెళ్లి కొడుకును చేసే టైం అవుతున్నా.. నవీన్ లేకపోవడంతో వెతకగా పొలం వద్ద విగతజీవిగా ఉన్నాడు. నవీన్ మృతి పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.

News April 4, 2024

సంగారెడ్డి ప్రమాదంలో మృతుల వివరాలు..

image

సంగారెడ్డి జిల్లాలో <<12982731>>ఘోర ప్రమాదం<<>> సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుగురికి పెరిగింది. 15 మందికి గాయాలవ్వగా మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు.. ఎండీ, డైరెక్టర్‌ రవికుమార్‌ (హైదరాబాద్‌), ప్రొడక్షన్ ఆఫీసర్‌ సుబ్రహ్మణ్యం (36), దయానంద్‌ (48), సురేష్‌పాల్‌ (43), కార్మికుడు విష్ణు (35)గా గుర్తించారు. ఈ పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష జరిపారు.

News April 4, 2024

వరంగల్: రైలు కిందపడి ఆత్మహత్య

image

అనారోగ్యంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్డవాడకు చెందిన నవీన్(24) నాలుగు నెలలుగా గొంతునొప్పితో బాధపడుతూ.. MGMలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం HYDకి వెళ్లాలని వైద్యులు సూచించారు. భయాందోళనకు గురైన నవీన్ అదేరోజు రాత్రి జాన్‌పీరీలు గేట్ సమీపంలో పుష్‌పుల్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News April 4, 2024

కామారెడ్డి: ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై అత్యాచారం

image

ఇన్‌స్టాలో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల KMRకి చెందిన సతీశ్‌‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను KMRకి రావాలని కోరాడు. 2రోజుల కిందట అక్కడకు వెళ్లిన ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 4, 2024

సత్తుపల్లి అమ్మాయితో స్పెయిన్ అబ్బాయి లవ్ మ్యారేజ్ 

image

సత్తుపల్లి అమ్మాయి స్పెయిన్ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాలిలా.. సత్తుపల్లికి చెందిన లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్‌ బార్సిలోనాలో  ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ ఉద్యోగి అయిన స్పెయిన్‌కి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి బుధవారం పెళ్లి చేసుకున్నారు.

News April 4, 2024

మద్దూర్: వివాహిత ఆత్మహత్య.. ప్రియుడు అరెస్ట్

image

పెళ్ళైన మూడు రోజులకే <<12979867>>వివాహిత ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై ఎస్ఐ రామ్ లాల్ వివరాలు.. యువతి(20)కి తల్లిదండ్రులు మార్చి నెలలో ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్లైన మూడో రోజున తన ప్రియుడు ఆమెను కలిశాడు. మార్చి 16న ఆమె పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా నిందితుడిని మంగళవారం రిమాండుకు తరలించారు.

News April 4, 2024

KNR: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై.. అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల కామారెడ్డికి చెందిన సతీశ్‌‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను కామారెడ్డికి రావాలని కోరగా.. రెండ్రోజుల కిందట వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News April 4, 2024

ASF: ఏనుగు దాడిలో మరో రైతు మృతి

image

జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.