Telangana

News April 3, 2024

భద్రాద్రి జిల్లా పోలీసుల హైఅలర్ట్..

image

తెలంగాణ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుస ఘటనలతో కసి మీద ఉన్న మావోయిస్టులు తమ వ్యూహాలకు పదును పెట్టి రెచ్చిపోతారని నిఘా వర్గాల సమాచారంతో బేస్ క్యాంపులకు పెద్ద ఎత్తున అదనపు బలగాలను రప్పిస్తున్నారు. తాజా పరిస్థితులను ఎస్పీ ఆరా తీస్తున్నారు.

News April 3, 2024

సంగారెడ్డి: నిన్న బీజేపీ.. నేడు బీఆర్ఎస్‌

image

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నిన్న బీజేపీలో చేరి, బుధవారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి సమక్షంలో కిషన్ రెడ్డి, మల్ రెడ్డి, బాల్‌రెడ్డి, కిరణ్ రెడ్డి, తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. వారు మాట్లాడుతూ.. బలవంతంగా నిన్న బీజేపీ కండువా కప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతామన్నారు.

News April 3, 2024

WGL: కొడుక్కి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

image

వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి ఓ తల్లి మంగళవారం KNRలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11) మృతి చెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

News April 3, 2024

మహబూబ్ నగర్‌లో పెరుగుతున్న ఎండలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. GDWL, NRPT జిల్లాలో
గత 24 గంటల్లో ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. NGKL, MBNR, WNPT జిల్లాలలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

News April 3, 2024

మద్దూర్: పెళ్లైన మూడు రోజులకే సూసైడ్

image

పెళ్లైన మూడు రోజులకే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్దూర్ మండల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపాడు గ్రామానికి చెందిన మమత(20) అదే గ్రామానికి చెందిన మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గత నెల16న పురుగు మందు తాగగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 3, 2024

ADB: కిడ్నీ సమస్యతో ఖాళీ అయిన ఊరు..!

image

ADB జిల్లా భీంపూర్ మండలం గోవింద్‌పూర్‌ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు బావుల నీటినే వినియోగించేవారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత సమస్యతో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో గ్రామస్థులు ఊరిని వదిలి వెళ్లిపోయారు.

News April 3, 2024

MBNR: అంతర్రాష్ట్ర పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

image

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర (తెలంగాణ & కర్ణాటక) సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. బళ్లారి రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ లోకేష్ కుమార్, జోన్-7 జోగులాంబ డిఐజి చౌహాన్, ఉమ్మడి జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు.

News April 3, 2024

రాయితీపై విత్తనాలు రైతులకు భారం తగ్గినట్లే

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులపై విత్తన భారాన్ని తగ్గించేందుకు
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్వం మాదిరి రానున్న వానాకాలం నుంచి రాయితీపై విత్తనాలను రైతులకు సరఫరా చేసే అంశంపై వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను ఇప్పటికే సమర్పించింది. రైతులకు విత్తన భారం నుంచి వెసలుబాటు కల్పించేలా పూర్వ విధానాన్ని అమలు చేయడమే కాక మరికొన్ని ప్రయోజనాలను అమలు వర్తింపచేసేందుకు తాజాగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

News April 3, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులకు కల్లాల కష్టాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటే రైతులకు కల్లాల కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల్లో కోతలు ముమ్మరం కానుండటంతో ఇప్పటి నుంచే ధాన్యం ఆరబోతకు పడరాని పాట్లు పడుతున్నారు. కోతలు ప్రారంభమైతే అనేక ప్రాంతాల్లో రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాలు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలో అమలు కాలేదు.

News April 3, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి సమాచారం అప్డేట్

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 513.10 అడుగులు (136.9932 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 4,881 క్యూసెక్కుల నీటిని, జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 6,231 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు.