Telangana

News April 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,700 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.800 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.25 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News April 3, 2024

భిక్కనూరులో ప్రేమ జంటపై దాడి.. ఆరుగురిపై కేసు

image

ప్రేమ జంటపై ఇరు కుంటుంబీకులు దాడి చేసిన ఘటన సోమవారం రాత్రి భిక్కనూరులో జరిగింది. మండలానికి చెందిన యువకుడు, తిప్పాపూర్‌కి చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం భిక్కనూరు టోల్ గేట్ వద్ద HYD బస్సు ఎక్కారు. వారిని వెంబడించిన కుటుంబీకులు రామయంపేట శివారులో యువకుడిని కొట్టి అమ్మాయిని తీసుకెళ్లారు. యువకుడి ఫిర్యాదు మేరకు మంగళవారం ఆరుగురిపై కిడ్నాప్ కేసు నమోదుచేసినట్లు SI సాయికుమార్ తెలిపారు.

News April 3, 2024

వేములవాడలో ఈనెల 9 నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు

image

వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. 9న ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని, పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 17 వరకు భక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని, సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.

News April 3, 2024

వేములవాడలో ఈనెల 9 నుంచి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు

image

వేములవాడ రాజన్న ఆలయంలో ఈనెల 9 నుంచి 17వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. 9న ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహిస్తామని, పండితులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 17 వరకు భక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని, సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని వివరించారు.

News April 3, 2024

HYD: రసూల్‌పురలో యువకుడి హత్య

image

HYD బేగంపేటలోని రసూల్‌పుర అంబేడ్కర్‌నగర్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

HYD: రసూల్‌పురలో యువకుడి హత్య

image

HYD బేగంపేటలోని రసూల్‌పుర అంబేడ్కర్‌నగర్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

నిర్మల్‌లో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

image

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్మల్ 43.5 డిగ్రీల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాదిలో 43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. జిల్లాలోని బైంసా మండలం వానల్ పాడ్, నర్సాపూర్ మండలంలో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

News April 3, 2024

MP ఎన్నికలు.. MBNR, NGKLలో తీవ్ర పోటీ!

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. MBNR, NGKL అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజా ఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది.

News April 3, 2024

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై వీడని పీటముడి

image

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయం తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్‌ ఇవ్వాలని కొందరు, వేరొకరికి అవకాశమివ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో వారం రోజులు సమయం పట్టొచ్చని తెలుస్తొంది.

News April 3, 2024

MBNR: అక్క గెలుపు కోసం.. ప్రచారంలో చెల్లెళ్లు

image

తమ సోదరి పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థి డీకే అరుణ గెలుపు కోసం ఆమె చెల్లెళ్లు పద్మావతి, సువర్ణ, సురేఖలు ప్రచారంలో భాగంగా తమ వంతు సహాయం చేస్తున్నారు. వివిధ మండలాల్లో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశాలకు డీకే అరుణతో పాటు హాజరవుతున్నారు. స్థానికురాలైన తమ సోదరి గెలిపిస్తే కేంద్ర స్థాయిలో ఆమెకు ప్రభుత్వం మంచి ప్రాధాన్యం ఇస్తుందని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి జరుగుతుందని వివరిస్తున్నారు.