India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మంగళవారం ధర్మపురి మండలంలోని జైన గ్రామంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జైన.. రాష్ట్రంలోనే నాల్గవ స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత సస్పెండ్ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత బక్క జడ్సన్ను పార్టీ నుంచి 6 సంవత్సరాలు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జడ్సన్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినవారే కావడం ఆసక్తికర అంశం. అటు మహబూబాబాద్లోనూ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరగానే టికెట్ లభించింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల పార్టీ మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి అలముకుంది.
ధరూర్ మండలం గార్లపాడు గ్రామంలో మంగళవారం ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. కుర్వ నాగేంద్ర కూతురు మమత(10) వ్యవసాయ బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లింది. ప్రమాద వశాత్తు నీట మునగటంతో ఊపిరాడక మృతి చెందింది. గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. బుధవారం పెద్ద కూతురు వివాహం ఉండగా, చిన్న కూతురు మృతితో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. మిరుదొడ్డికి చెందిన సోహెల్, హుస్సేన్ దగ్గర ప్రతి నెలా రూ.40 వేలు వాయిదా పద్ధతిలో కారు కొన్నాడు. ఈక్రమంలో 3నెలల నుంచి వాయిదా చెల్లించకపోవడంతో కారును తీసుకున్నాడు. గతంలో కట్టిన డబ్బులు తిరిగివ్వాలని కోరాగా, హుస్సేన్ నిరాకరించాడు. దీంతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
HYDలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలని బాబాయ్ యువతిని వేధించాడు. బాధితురాలు తల్లికి చెప్పడంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి లైంగికంగా వేధించగా ఆమె షీటీమ్స్కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు పంపారు. అంతేకాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లోనే 96 మంది పోకిరీలపై చర్యలు తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
HYDలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలని బాబాయ్ యువతిని వేధించాడు. బాధితురాలు తల్లికి చెప్పడంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి లైంగికంగా వేధించగా ఆమె షీటీమ్స్కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు పంపారు. అంతేకాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లోనే 96 మంది పోకిరీలపై చర్యలు తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
తాండూరులోని సుభద్ర కాలనీకి చెందిన అజ్గర్ <<12972348>>హత్యకు గురైన<<>> విషయం తెలిసిందే. అతడి ఫోన్ సిగ్నల్స్ ద్వారా IBలోని ఓ కాలనీకి చెందిన దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. మార్చి 31 రాత్రి అజ్గర్ను ఇంటికి పిలిచి తలపై రాడ్డుతో కొట్టి గొంతు నులిమి చంపేశారు. తన భార్యను అజ్గర్ ప్రేమ పేరుతో వేధించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ఆ ముగ్గురిని ASF సబ్ జైలుకు తరలించారు.
కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనా సంఘటన మంగళవారం చింతలపాలెం మండల పరిధిలోని బుగ్గమాదారం గ్రామ శివారులో బుగ్గ వాగు కృష్ణానదిలో కలిసే చోట వెలుగు చూసింది. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుగ్గ మాధవరం గ్రామంలోని బుగ్గ వాగు కృష్ణ నదిలో కలిసే ప్రాంతంలో సుమారు 55 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన మగ వ్యక్తి మృతదేహం కనిపించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు
భార్య పుట్టింటికి వెళ్లిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఎస్ఐ సాయికుమార్ కథనం ప్రకారం ముస్తఫానగర్కు చెందిన యల్లబోయిన ఉపేందర్(33) భార్య నీలిమతో గొడవపడగా ఆమె సోమవారం రాత్రి సమీపంలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఉపేందర్ పురుగుల మందు తాగాడు. మంగళవారం నీలిమ ఇంటికి రాగా, ఉపేందర్ అపస్మారక స్థితిలో ఉండడంతో ఇంటిపక్కవారిని పిలిచి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.