Telangana

News April 3, 2024

KMR: బైక్ కొనివ్వలేదని యువకుడి సూసైడ్

image

తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని మనస్తాపం చెంది యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన దోమకొండలో జరిగింది. మండలానికి చెందిన వంశీ(24) కొన్నిరోజులుగా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యి సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు SI గణేశ్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 3, 2024

జగిత్యాల: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె చెరువులో చోటుచేసుకుంది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగేంద్రనగర్‌కు చెందిన ఉమా మహేశ్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఎడుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. మహేశ్ నీటిలో ముగినిపోగా.. మిగతా విద్యార్థులు ఒడ్డుకు చేరుకున్నారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. గాలింపుల్లో బాలుడి మృతదేహం వలలో చిక్కింది.

News April 3, 2024

గుండెపోటుతో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ మృతి

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్‌కు చెందిన నాగార్జున కొన్ని సంవత్సరాలుగా ఈజీఎస్‌లో టీఏగా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల కొత్తగూడ మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

News April 3, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం
∆} పదో తరగతి పేపర్ల మూల్యకలనం
∆} కూసుమంచి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News April 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నేటి నుంచి 10వ తరగతి వ్యాల్యూషన్
✏దేవరకద్ర:నేడు ఉల్లిపాయల వేలం
✏నేటి రంజాన్ వేళలు:
ఇఫ్తార్(బుధ)-6:36,సహార్(గురు)-4:38
✏MBNR:నేడు PUలో ఉద్యోగ మేళా
✏ఉమ్మడి జిల్లాలో గంజాయి, సారా నియంత్రణపై అధికారుల ప్రత్యేక ఫోకస్
✏అలంపూర్:నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✏వరి కొనుగోలు ధాన్యాలపై అధికారుల సమీక్ష
✏పలు నియోజకవర్గాల్లో MBNR&NGKL ఎంపీ అభ్యర్థుల పర్యటన
✏ఎలక్షన్ కోడ్.. ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో నిఘా

News April 3, 2024

KNR కాంగ్రెస్ MP టికెట్‌పై ఉత్కంఠ!

image

KNR MPఅభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ అడుగులేస్తోంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ KNR విషయంలో జాప్యం చేస్తోంది. ప్రజలతో సత్సంబంధాలతో పాటు.. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరికి ఓట్లు ఎక్కువొస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావులు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా.. మరో కొత్త అభ్యర్థిని సైతం వెతుకుతున్నట్లు సమాచారం.

News April 3, 2024

మహబూబాబాద్: నలుగురి పై గృహ హింస కేసు నమోదు

image

అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన మహేశ్వరికి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నాదెళ్ల నవజీవన్‌తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో నవజీవన్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

News April 3, 2024

MBNR: SSC రాశారా.. ఇది మీ కోసమే!

image

ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ అధికారులు బుధవారం నుంచి పేపర్ మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ మేరకు MBNR, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన పేపర్లను పాలమూరులోని గ్రామర్ స్కూల్లో వాల్యుయేషన్ చేయనున్నారు. మొత్తం 2.30 లక్షల పేపర్ల వాల్యుయేషన్ కోసం 800 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 150 చీఫ్ ఎగ్జామినర్లు, 260 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. SHARE IT

News April 3, 2024

HYD: లాలాగూడ‌ CI సస్పెన్షన్

image

పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్‌ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లాలాగూడ CI పద్మను సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందితే నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయట. విచారణ చేపట్టిన కమిషనర్ తప్పుడు కేసుగా గుర్తించి.. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 3, 2024

ఈనెల 6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే..?

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సొంత పార్టీతో తెల్లం వెంకట్రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ బహిరంగ సభ శనివారం జరగనుంది. ఈ సభలోనే తెల్లం వెంకట్రావు తన అనుచరులతో పాటు హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.