Telangana

News April 2, 2024

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి తుమ్మల

image

ఖమ్మం నగరంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇఫ్తార్‌ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.

News April 2, 2024

NLG: 676 మంది పిఓ, ఏపీఓలకు షోకాజ్ నోటీసులు

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం లోక్ సభ ఎన్నికల పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ కార్యక్రమానికి మొత్తం 4740 మంది హాజరు కావాల్సి ఉండగా 4064 మంది మాత్రమే హాజరయ్యారు. 676 మంది శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరు కావడంతో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు.

News April 2, 2024

BREAKING: MDK: రఘునందన్‌రావుపై FIR నమోదు

image

మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు.

News April 2, 2024

HYD: విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య

image

ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన RR జిల్లా కొందుర్గులో జరిగింది. SI తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్‌పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా ఈరోజు శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News April 2, 2024

HYD: విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య 

image

ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన RR జిల్లా కొందుర్గులో జరిగింది. SI తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్‌పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా ఈరోజు శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది. 

News April 2, 2024

గద్వాల: బావిలో‌ ఈతకు వెళ్లి బాలిక మృతి

image

గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన మమత(11) నేడు గ్రామ శివారులోని బావిలో ఈతకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈత కొడుతున్న మమత ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు వచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

News April 2, 2024

HYD: అగ్ని ప్రమాదాలపై నోటీసులకే పరిమితమా..?

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.

News April 2, 2024

HYD: అగ్ని ప్రమాదాలపై నోటీసులకే పరిమితమా..?

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.

News April 2, 2024

అరవింద్, జీవన్‌రెడ్డి.. దొందూ దొందే : బాజిరెడ్డి

image

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి SRS గార్డెన్లో BRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. MP అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… అరవింద్, జీవన్ రెడ్డి దొందూ దొందే అని విమర్శించారు. వారిద్దరు నిజామాబాద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ నుంచి MLCగా ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కరోజైనా మోపాల్ మండల ప్రజల మంచి, చెడు అడిగారా అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటానన్నారు.

News April 2, 2024

MDK: GOVT టీచర్ MISSING

image

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు 3 రోజులుగా కనిపించడం లేదు. చేగుంటలో నివాసం ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. 3 రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అతడి కుమారుడు వంశీధర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లోనే ఫోన్లు, బైక్ వదిలి వెళ్లాడు. కేసు నమోదైంది.