India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు, రోగులకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
భారీ వర్షాలు విద్యార్థుల చదువును వరదల పాలు చేశాయి. ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసి పాడైపోవడం వంటివి జరిగాయి. దీంతో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది.
వయోజనులను అక్షరాలు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నవ భారత సాక్షరత కార్యక్రమం అమలు చేసిందని, వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామని వయోజన విద్య ప్రోగ్రాం అధికారి నుమాన్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో MBNR-55.04%, GDWL-49.87%, NGKL-58.99%, NRPT-49.98%, WNPT-55.67 శాతం అక్షరాస్యత ఉందని అంచనా. GDWL జిల్లా రాష్ట్రంలోనే అక్షరాస్యత అత్యల్పంగా ఉంది. నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
సంగారెడ్డి జిల్లాలోని 3, 6, 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 10న న్యాస్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఇప్పటికే పాఠశాలలకు పంపించినట్లు చెప్పారు. విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు మళ్లీ మండల విద్యాధికారి కార్యాలయానికి పంపించాలని సూచించారు.
HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.
ఐదు రోజుల బాలుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఓ పిల్లల ఆసుపత్రిలో జరిగింది. కాగా, వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత పుట్టిన బాబు మృతితో బాధితులు తీవ్ర రోదనకు గురయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYDలో కేటుగాళ్లు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టెన్త్ చదివితే చాలు FAKE ఐడీ, ఆధార్ కార్డులు, జాబ్ ఆఫర్ లెటర్లు, ఫేక్ డిగ్రీ, B.Tech మెమోలు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అవే ఒరిజినల్ అని నమ్మిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జాబ్ వచ్చేలా చేస్తామని రూ.లక్షలు కాజేస్తున్నారు. ప్రతి విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని రాచకొండ CP సుధీర్ బాబు సూచించారు.
విద్య ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నేడు మంత్రి సీతక్క ట్వీట్ చేశారు. చదువు మన తలరాతను మారుస్తుందని, ప్రతి ఒక్కరు కష్టపడి చదివి మన సమాజాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
NLG జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అవసరమైన సొంత భవనాలు లేక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. అనేక మండలాల్లో ప్రస్తుతం ఇవి అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, పాత గదులలో కొనసాగుతున్నాయి. నల్గొండ పట్టణంలోని చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకుగా, అరకొర వసతులున్న ఆ భవనాల్లో చిన్నారులను ఆడించాలన్నా, వారికి భోజనం పెట్టాలన్న, చదువు చెప్పాలన్నా ఇబ్బందిగా మారింది.
Sorry, no posts matched your criteria.