Telangana

News April 2, 2024

HYD: బస్ షెల్టర్లు లేక.. మండే ఎండలో ప్రయాణికులు!

image

HYDలోని హిమాయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, అమీర్‌పేట్, ఉప్పల్, బాటసింగారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు 43 డిగ్రీలకు పైగా దంచి కొడుతున్న మండే ఎండలో నిలబడి అలసిపోతున్నారు. ఏర్పాటు చేసిన చోటే అధికంగా ఉండడంతో పలుచోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్ షెల్టర్లు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 2, 2024

HYD: బస్ షెల్టర్లు లేక.. మండే ఎండలో ప్రయాణికులు!

image

HYDలోని హిమాయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, అమీర్‌పేట్, ఉప్పల్, బాటసింగారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు 43 డిగ్రీలకు పైగా దంచి కొడుతున్న మండే ఎండలో నిలబడి అలసిపోతున్నారు. ఏర్పాటు చేసిన చోటే అధికంగా ఉండడంతో పలుచోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్ షెల్టర్లు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News April 2, 2024

HYD: ‘సిబ్బంది సగం.. తనిఖీలు తూచ్’

image

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తూనీక కొలతల శాఖలో లైసెన్స్ హోల్డర్ల నియామకం అంతంత మాత్రంగానే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 30 మందికి పైగా సిబ్బంది లేకపోవడం గమనార్హం. దీంతో తూనికలపై నగరంలోని అనేక చోట్ల తనిఖీలు కరవయ్యాయి. లైసెన్స్ లేకుండానే అనేక దుకాణాల్లో విచ్చలవిడిగా బరువు కొలిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వాటికి గ్యారంటీ ఏంటని వినియోగదారులు వాపోతున్నారు.

News April 2, 2024

HYD: ‘సిబ్బంది సగం.. తనిఖీలు తూచ్’

image

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తూనీక కొలతల శాఖలో లైసెన్స్ హోల్డర్ల నియామకం అంతంత మాత్రంగానే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 30 మందికి పైగా సిబ్బంది లేకపోవడం గమనార్హం. దీంతో తూనికలపై నగరంలోని అనేక చోట్ల తనిఖీలు కరవయ్యాయి. లైసెన్స్ లేకుండానే అనేక దుకాణాల్లో విచ్చలవిడిగా బరువు కొలిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వాటికి గ్యారంటీ ఏంటని వినియోగదారులు వాపోతున్నారు. 

News April 2, 2024

HYD: ‘13న KCR సభ దద్దరిల్లాలి’

image

పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపే లక్ష్యంగా ఈనెల 13న చేవెళ్లలో నిర్వహించే KCR భారీ బహిరంగ సభ దద్దరిల్లాలని BRS ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను చేవెళ్ల MLA కాలే యాదయ్య ఆధ్వర్యంలో MLA సబితా ఇంద్రారెడ్డి, అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, MLA టి.ప్రకాశ్ గౌడ్, MLC వాణిదేవి తదితరులు పరిశీలించారు.

News April 2, 2024

HYD: ‘13న KCR సభ దద్దరిల్లాలి’

image

పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపే లక్ష్యంగా ఈనెల 13న చేవెళ్లలో నిర్వహించే KCR భారీ బహిరంగ సభ దద్దరిల్లాలని BRS ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను చేవెళ్ల MLA కాలే యాదయ్య ఆధ్వర్యంలో MLA సబితా ఇంద్రారెడ్డి, అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, MLA టి.ప్రకాశ్ గౌడ్, MLC వాణిదేవి తదితరులు పరిశీలించారు. 

News April 2, 2024

మిర్చి ధరల తిరోగమనం.. రూ.2 వేలు తగ్గుదల

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి ధరలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. మార్కెట్లో మంగళవారం క్వింటా మిర్చిని రూ.19,500 జెండాపాట నిర్ణయించగా వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటా రూ.11,000 నుంచి రూ.15,000 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మార్చిలో క్వింటా రూ.21,500 పలికిన మిర్చి ధర ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెల రోజుల క్రితం ధరతో పోలిస్తే క్వింటాకు సుమారు రూ.2,000 తగ్గింది.

News April 2, 2024

MDK: అమ్మాయిని వేధించిన వ్యక్తికి జైలు శిక్ష

image

మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌కు చెందిన గుండ్లకుంట బాబు(45)కు నాలుగేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి లక్ష్మీశారద తీర్పునిచ్చినట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. మండలానికి చెందిన అమ్మాయిని వేధిస్తూ.. ‘నా దగ్గరికి రాకపోతే మీ తల్లిని చంపేస్తా’ అని బెదిరించాడని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించినట్లు చెప్పారు.

News April 2, 2024

మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ చందనా దీప్తి

image

మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. ప్రచారాలకు ఉపయోగించే వాహనాలు, మైకులకు ముందస్తుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు, ప్రార్థన మందిరాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.

News April 2, 2024

BRSకు ఓటేస్తే.. మీ ఓటు వృథా అయినట్లే: డీకే అరుణ

image

ధన్వాడ: BRSకు ఓటేస్తే మీ ఓటు వృథా అయినట్లే అని బీజేపీ ఉపాధ్యక్షురాలు, MBNR ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం ధన్వాడ, మరికల్ మండలాలకు చెందిన బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS పని అయిపోయిందని, ఆ పార్టీకి ఓటేస్తే మీ ఓటు వృథా అవుతుందన్నారు.BJP గెలుపుపై కార్యకర్తలతో దిశానిర్దేశం చేశారు.