Telangana

News April 2, 2024

ఓయూ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

News April 2, 2024

ఓయూ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

News April 2, 2024

ఓయూ డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

News April 2, 2024

MBNR, NGKLలో బీఆర్ఎస్ జెండా ఎగరేసేనా..?

image

ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2019లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో BRS గెలిచింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. పలు జిల్లాల్లో క్యాడర్ కూడా బలంగా ఉంది. MP ఎన్నికల్లో తప్పకుండా BRS గెలుస్తుందని MBNR, NGKL అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమాలో ఉన్నారు. దీనిపై మీ కామెంట్..?

News April 2, 2024

కరీంనగర్: హత్యకు గురైన విద్యార్థి తల లభ్యం

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి తల లభ్యమైంది. మార్చి 1న విద్యార్థి అదృశ్యం కాగా.. 27న తల లేకుండా విద్యార్థి మొండెంతో మృతదేహం లభ్యమైంది. తల కోసం గాలించిన పోలీసులు.. ఓ బావిలో మంగళవారం గుర్తించారు. బావిలో నీరు ఖాళీ చేయించి తలను వెలికితీశారు. ఘటనా స్థలంలోనే వైద్యాధికారులతో తలకు పోస్టుమార్టం నిర్వహించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

ఖమ్మం: లారీ, ట్రాక్టర్ ఢీ.. కూలీ మృతి

image

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఓ లారీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న కూలీ జుజ్జునూరి మాధవరావు(53) అక్కడికక్కడే మృతి చెందాడు. వరి గడ్డి లోడుతో నాచారం నుంచి దిద్దుపూడి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మాధవరావు దిద్దుపూడి గ్రామానికి చెందిన కూలీగా గుర్తించారు.

News April 2, 2024

NZB: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

నల్గొండలో KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..

image

ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు మనవే అని నల్గొండలో నిర్వహించినBRS సన్నాహక సమావేశంలో KTR అన్నారు. ‘నల్గొండ, మిర్యాలగూడ, కోదాడను ఎంతో అభివృద్ధి చేశాం. మూడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. జిల్లాలో ఫ్లోరోసిస్‌ రూపుమాపడంతోపాటు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోలేకపోయాం. NLG కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలున్నారు’ అన్న KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..

News April 2, 2024

MDK: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

వరంగల్ మార్కెట్‌లో పలు ఉత్పత్తుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పలు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. నం.5 రకం మిర్చి క్వింటాకి రూ.13 వేలు, సింగిల్ పట్టి రకం క్వింటాకు రూ.42,500 పలికింది. అలాగే మక్కలు క్వింటాకు రూ.2,175 ధర పలికాయి. కాగా గతవారంతో పోలిస్తే ఈరోజు మక్కల ధర భారీగా తగ్గింది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.