India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీల్స్ అఫైర్స్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి షాక్కు గురయ్యారు. ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఈగ ఉండడంతో అవాక్కయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించి త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
HYD జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీల్స్ అఫైర్స్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి షాక్కు గురయ్యారు. ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఈగ ఉండడంతో అవాక్కయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించి త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగుతోంది. ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 863.40 అడుగులకు చేరింది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు.
అనారోగ్యాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. బీడీఎల్ సీఐ స్వామిగౌడ్ వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఘన్పూర్ గ్రామంలో ఉంటున్న రేవతి(17) మూర్ఛతో బాధపడుతోంది. తల్లిదండ్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా మార్పు రాకపో వడంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రేవతి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు
జిల్లాలో అన్ని ప్రభుత్వ చౌకధర దుకాణాలకు ఆగస్టు నెల కోటా బియ్యాన్ని ఈనెల 31 వరకు సరఫరా చేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పట్టణంలోని మండల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని చౌకధర దుకాణాల్లో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఆగస్టు నెలకు జిల్లాకు 6836.36 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారన్నారు.
బొలెరో వాహనం బైక్ను ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఐ చంద్రశేఖర్ వివరాలు ప్రకారం.. భూత్పూర్ మండలంలోని శేరిపల్లి(హెచ్)కి చెందిన సాయితేజ(21) బైక్పై భూత్పూర్ చౌరస్తా నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇంటర్నల్ రోడ్డుపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సాయితేజ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. 865 అడుగుల మేర వరద జలాల ప్రవాహం ఉండటంతో సప్తనదుల ప్రాంతంలో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా మునుగుతుందని పురోహితులు రఘురామ శర్మ చెప్పారు. సంగమేశ్వర క్షేత్రంతో పాటు సోమశిల, జటప్రోల్లో పురాతన దర్గాలు, సురభిరాజుల కట్టడాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని తీర గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీసీసీబీ బ్యాంకులో మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తీర్మానం జీవోలు జారీ చేయగా వాటిని డీసీసీబీ ఛైర్మన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. నాబార్డు డీడీఎం సత్యనారాయణ, డీసీఓలు తదితరులు పాల్గొన్నారు.
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మసస్తాపం చెందిన యువతి పురుగు మందు తాగింది. సిద్దిపేట 3-టౌన్ CI తెలిపిన వివరాలు.. కొండపాక మండలానికి చెందిన యువతి, ఖమ్మంపల్లి వాసి నితీశ్ ప్రేమించుకున్నారు. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా యువకుడు నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులు మాట్లాడినా యువకుడు పెళ్లికి నో చేప్పడంతో ఈనెల 10న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. కేసు నమోదైంది.
జూరాల జలాశయంలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయంలోకి 2.65 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 36 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 20 వేలు కలిపి 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 6.554 టీఎంసీల మేర ఉంది. ఆల్మట్టి జలాశయానికి 2.75 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుందని జూరాల అధికారులు వివరించారు.
Sorry, no posts matched your criteria.