Telangana

News April 2, 2024

ఖమ్మం: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 2, 2024

మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?

News April 2, 2024

మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?

News April 2, 2024

NZB: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సులోచన అనే మహిళ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరంతా ఒక కారులో మంగళవారం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు కారంపొడి కోసం వెళ్లి తిరిగి వస్తుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద వీరి కారు ప్రమాదవశాత్తు చెట్టును బలంగా ఢీ కొంది. సులోచన స్పాట్ లోనే మృతిచెందగా అనిత, సునీత, కవితకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

సిద్దిపేట: బండి సంజయ్ మోడీ దగ్గర దీక్ష చేయాలి: మంత్రి పొన్నం

image

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర దీక్ష చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మోదీ దగ్గర దీక్ష చేయాలన్నారు.

News April 2, 2024

కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తాను జాతీయహోదా తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేటలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు పార్లమెంటులోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తాను మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులు ప్రారంభానికి కృషిచేశానని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేని మాటలు మానుకోవాలన్నారు.

News April 2, 2024

NLG: రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా !

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హత్యలు, దందాలు, బెదిరింపులు, అక్రమ వ్యాపారాలు ఇతర నేరాలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,936 మంది పాత నేరస్థులను పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్లుగా ఉన్న వారు, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలు సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

News April 2, 2024

సిద్దిపేట: ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తా: వెంకట్‌రామ్ రెడ్డి

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సాయి సమావేశంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్‌రామ్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని, అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, పేద కుటుంబాలకు ఒక రూపాయి ఖర్చుతో పేరు నమోదు చేసేలా ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. 

News April 2, 2024

ఖమ్మం: తీవ్ర ఎండల నేపథ్యంలో హెల్ప్ సెంటర్ ఏర్పాటు

image

ఖమ్మం జిల్లాలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రత్యేకంగా 24 గంటల పాటు పని చేసేలా హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా వడదెబ్బకు గురైనా, ఎండకు అపస్మారక స్థితికి చేరుకున్నా సమాచారాన్ని జిల్లా కేంద్రంలోని 8501003838, 8639522447 నంబరుకు తెలియజేస్తే తక్షణమే అందుబాటులో ఉన్న అంబులెన్సుతో పాటు వైద్య చికిత్సలకు దగ్గరలోని పీహెచ్సీకి తరలించి చికిత్సలు అందిస్తామని జిల్లా వైద్యాధికారులు తెలియజేశారు.

News April 2, 2024

NLG: మామిడి పండ్ల ధరలకు రెక్కలు

image

ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్‌ లేట్‌గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. జిల్లాలో ఈసారి కాత ఆశించినంత లేకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి.