Telangana

News April 2, 2024

RGM: ఎన్టిపిసి వార్షిక ఉత్పత్తి వివరాలు

image

రామగుండం NTPC 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. 1600 మెగావాట్ల తెలంగాణ ప్లాంటులో మార్చి 29 నాటికి 37.12 మి. యూ, 2600 మెగావాట్ల ప్లాంట్‌లో మార్చి 26 నాటికి 16,645 మి.యూ. విద్యుత్ ఉత్పత్తి నమోదయింది. NTPC రిజర్వాయర్‌లోని 100 MV ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లో 164.21 మి.యూ.కు గాను 196.17మి.యూ.తో 15.58 శాతం అధిక ఉత్పత్తి నమోదు చేసిందని పేర్కొన్నారు.

News April 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నీటి ఎద్దడి నివారణకు అధికారుల ఫోకస్
✏నేడు పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
✏పెద్ద పెద్దపల్లి: నేడు రైతు వేదికలో శాస్త్రవేత్తల సలహాలు
✏నేటి రంజాన్ వేళలు: ఇఫ్తార్(మంగళ)-6:37,సహార్(బుధ):4:48
✏పలు చోట్ల చలివేంద్రాల ఏర్పాట్లు
✏ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు
✏జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ
✏నవోదయ ఫలితాలు విడుదల
✏పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు

News April 2, 2024

WGL: రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.335 కోట్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కొద్దిగా తగ్గినా రిజిస్ట్రేషన్ దస్తావేజుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 1,09,892 దస్తావేజులకు గాను రూ.335.01 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం రూ.350 కోట్లు ఆదాయం సమకూరింది.

News April 2, 2024

మహా గ్రేటర్‌గా హైదరాబాద్‌..!

image

హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత‌ ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు‌ 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్‌ నాటికి మహా గ్రేటర్‌‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు. SHARE IT

News April 2, 2024

మహా గ్రేటర్‌గా హైదరాబాద్‌..!

image

హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత‌ ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు‌ 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్‌ నాటికి మహా గ్రేటర్‌‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు.
SHARE IT

News April 2, 2024

ఉమ్మడి‌ మెదక్‌లో‌ పెరిగిన ఎండలు

image

ఉమ్మడి మెదక్‌‌లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు బయటకురాలేని పరిస్థితి నెలకొంటోంది. సోమవారం తెలంగాణలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చేర్యాల మండల చిట్యాలో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT

News April 2, 2024

KMM: 3 నుంచి ‘ పది ‘ జవాబుపత్రాల మూల్యాంకనం

image

టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంకు ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది 2,18,980 పత్రాలను ఇక్కడ దిద్దగా ఈసంవత్సరం 2,10,480 పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. గత సంవత్సరం జవాబు పత్రాలు అధికంగా ఉండటంతో భద్రాద్రి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఈసారి కేవలం ఖమ్మం జిల్లాకు చెందినవారు మాత్రమే ఈకార్యక్రమంలో పాల్గొనున్నారు.

News April 2, 2024

కిరణ్ కుమార్ రెడ్డి 4లక్షల మెజార్టీతో గెలుస్తాడు:రాజగోపాల్ రెడ్డి

image

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ, భువనగిరి స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్నారు.

News April 2, 2024

కామారెడ్డి: అక్కడ మహిళలే నిర్ణేతలు..!

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మొత్తం 16,31,996 ఓట్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,98,220, మహిళలు 8,33,718, ట్రాన్స్‌జెండర్లు 58 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారి పోలింగ్ శాతమే అధికం. కాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓటర్లపైనే ఆధారపడి ఉంది.

News April 2, 2024

ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్

image

ఉమ్మడి జిల్లాలో వాతావరణం రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.