Telangana

News April 1, 2024

రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

image

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేసేందుకు TSRTC సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు TSRTC లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని పేర్కొంది. సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు.

News April 1, 2024

సికింద్రాబాద్: ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ!

image

కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. 

News April 1, 2024

సికింద్రాబాద్: ఆత్మహత్యాయత్నం చేసుకున్న మహిళ!

image

కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ సికింద్రాబాద్ డివిజన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. అనంతరం ఆమె పూర్తి వివరాలను తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, ఊరికే ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు.

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో ‘TODAY TOP NEWS”

image

☞పెబ్బేరు మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
☞SDNR:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
☞MBNR: ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరారీ
☞ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత
☞MBNR:వివాహిత సూసైడ్.. కేసు నమోదు
☞గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి: కలెక్టర్లు
☞MLC ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా
☞GDWL:రేపు 5K రన్
☞ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఉమ్మడి జిల్లా MLAలు
☞వరి కొనుగోలు కేంద్రాలపై ఫోకస్

News April 1, 2024

రూ. 151 చెల్లిస్తే.. ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించిందని సోమవారం సంగారెడ్డి డిపో మేనేజర్ తెలియజేశారు. రూ. 151 చెల్లిస్తే రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరుస్తామని, ఇందుకోసం టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలలో సంప్రదించాలని తెలిపారు.

News April 1, 2024

KNR: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

image

ఇబ్రహీంపట్నం మండల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజేశ్వర్రావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన వేముల దీక్ష (23) తన బావ దిలీప్‌తో కలిసి కథలపూర్ మండలం పోతారం గ్రామానికి బైక్‌పై వెళ్తోంది. ఈక్రమంలో రాళ్లలోడుతో వస్తున్న టిప్పర్ అతివేగంగా బైక్‌ను ఢీ కొంది. దీంతో దీక్ష టిప్పర్ వెనకాల చక్రాల్లో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు.

News April 1, 2024

దండేపల్లి: రెండు బొలెరో వాహనాలు ఢీ

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ వద్ద చేపల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం.. ఎదురుగా వస్తున్న మరో బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

రూ.2.43 కోట్లు స్వాధీనం: కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ.2.43 కోట్లు పట్టుకున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న నగదు రూ.1.17 కోట్లు, 7403 లీటర్ల మద్యం విలువ రూ. 29.35 లక్షలు, 10 వాహనాల విలువ 2.32 లక్షలు, అలాగే బంగారం, ఇతర ఆభరణాలు విలువ రూ. 23.32 లక్షలు, ఇతర వస్తువుల విలువ 70.28 లక్షలు ఉంటుందన్నారు.

News April 1, 2024

లారీని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి పరిస్థితి విషమం

image

బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు వద్ద ఓ లారీని సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్తానికులు వెంటనే ఐటీసీ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్ల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి : శాంతికుమారి

image

అన్ని ప్రాంతాలలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆమె హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లతో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, తాగునీరు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.