Telangana

News April 1, 2024

SDNR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

షాద్ నగర్ వై జంక్షన్ సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

అసెంబ్లీకి రారు.. అర్ధ ఎకరం కోసం వస్తారు: ఎమ్మెల్యే

image

మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రారు.. కానీ అర్ధఎకరం కోసమైతే వస్తారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంగ్రెస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు.

News April 1, 2024

ADB: అదుపు తప్పి లోయలో పడ్డ ఆటో

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని లక్ష్మీ పూర్ చెక్ పోస్ట్ వద్ద ఆదిలాబాద్ వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాక, మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వారిని 108 వాహనం ఈఎంటీ కిషన్, పైలెట్ విట్టల్ గౌడ్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

News April 1, 2024

HYD: ఇకపై ఆరు రోజులే గడువు..!

image

గ్రేటర్ HYDలో జీరో తదితర విద్యుత్తు బిల్లులను ఇక ప్రతి నెల ఆరో తేదీలోపు జారీ చేయాలని డిస్కం.. సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ 6వ తేదీన పూర్తి చేయాల్సిందేనని క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. సిటీలో గృహ, వాణిజ్య, ఇతరత్రా విద్యుత్తు కనెక్షన్లు 60 లక్షల దాకా ఉన్నాయి. గడువు రోజుకు పూర్తి చేయాలంటే సగటున రోజుకు 10 లక్షల బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది.

News April 1, 2024

HYD: ఇకపై ఆరు రోజులే గడువు..!

image

గ్రేటర్ HYDలో జీరో తదితర విద్యుత్తు బిల్లులను ఇక ప్రతి నెల ఆరో తేదీలోపు జారీ చేయాలని డిస్కం.. సిబ్బందిని ఆదేశించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ 6వ తేదీన పూర్తి చేయాల్సిందేనని క్షేత్రస్థాయికి ఆదేశాలు వెళ్లాయి. సిటీలో గృహ, వాణిజ్య, ఇతరత్రా విద్యుత్తు కనెక్షన్లు 60 లక్షల దాకా ఉన్నాయి. గడువు రోజుకు పూర్తి చేయాలంటే సగటున రోజుకు 10 లక్షల బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది.

News April 1, 2024

హుస్నాబాద్: కలకలం రేపిన మృతదేహం!

image

హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మచెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలడం సోమవారం కలకలం రేపింది. చెరువుకట్ట వద్దకు ఉదయపు నడకకు వెళ్లిన వారు చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలుతుండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని, మృతదేహాన్ని వెలికితీయించారు. మృతిచెందిన వ్యక్తిని అక్కన్నపేట మండలం అంతకపేటకు చెందిన సాగర్‌గా గుర్తించారు.

News April 1, 2024

KMR: మద్యం తాగి డ్రైవింగ్..మూడు రోజుల జైలు శిక్ష

image

మద్యం తాగి వాహనం నడుపుతూ..హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి సయ్యద్ సుల్తాన్.. సదాశివనగర్ పోలీసులకి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని పోలీసులు కామారెడ్డి రెండవ తరగతి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రతాప్ ముందు హాజరు పరచగా మూడు రోజుల జైలు శిక్ష, రూ.300 జరిమానాన్ని విధించారు. మద్యం తాగి వాహనాలని నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

News April 1, 2024

అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి: కొప్పుల

image

ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఈ మేరకు రామగుండం సీపీ ఎం శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

News April 1, 2024

ఫణిగిరిలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు లభ్యం

image

సూర్యాపేట జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధ కళా ఖండాలుగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలు పురావస్తు శాస్త్రవేత్తలు ఆదివారం వెలికి తీశారు. తవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్తంభాలు బయటపడ్డాయి. 2015లో కూడా ఫణిగిరిలో 2వేల ఏళ్లనాటి బౌద్ధ అవశేషాలను పురావస్తు శాఖ వారు కనుగొన్నారు.

News April 1, 2024

శంకర్‌పల్లి: గుర్తు తెలియని మహిళ మృతి

image

గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. సోమవారం CI తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధి రామంతాపూర్‌లో గౌండ్ల పాండు గౌడ్ టిఫిన్ సెంటర్ వద్ద ఓ మహిళ(55) మృతదేహం లభ్యమైంది. మహిళ ఒంటిపై ఆరెంజ్ క్రీమ్ కలర్ చీర, బ్లూ కలర్ జాకెట్ ఉన్నాయి. ఆహారం దొరకక, ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి మహిళ చనిపోయిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.