India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KMM: వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతవాసులు అందరూ ముందస్తు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడి కేంద్రాల నిర్వహణ ప్రతిష్టం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాలు 65 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 65ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. కొడంగల్ ప్రాజెక్టులో ఆయాలు 65ఏళ్ల పైబడి ఉన్నారని గుర్తించారు. త్వరలో వీరుంతా పదవీ విరమణ చేయనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, కాలువలు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన WGL జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం చింతకుంటకు చెందిన కొమురం జగన్ NSPT పోలీస్ స్టేషన్లో పట్టణ CI గన్మెన్గా పనిచేస్తున్నాడు. అయితే శనివారం గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని ఇంటి వెళ్లాడు. వాంతులు చేసుకోగా.. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడతంతో అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికలు వివరాల ప్రకారం.. రామగుండం(ఎన్టీపీసీ) సుభాశ్ నగర్కు చెందిన బల్ల గంగా భవాని గుజరాత్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో విధులు నిర్వహిస్తున్న గంగా భవాని మృతి శనివారం చెందింది. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మృతురాలి డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మందికి ప్రస్తుతం 10,225 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 508 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 1,975 మంది SGTలకు SAగా విద్యాశాఖ పదోన్నతి కల్పించింది.DSC ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించినా ఇంకా సుమారు 2 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరో DSCకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేక్మాల్లో ఇల్లు కూలడంతో నిద్రిస్తున్న మహిళ చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దత్తయ్య, శంకరమ్మ(60) దంపతులు శనివారం ఇంట్లో పడుకున్నారు. ఇటీవల వర్షాలతో నానిన వారి ఇల్లు కూలడంతో శంకరమ్మ నిద్రలోనే మృతిచెందింది. భర్త దత్తయ్య మరో గదిలో పడుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.
HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రధాన బ్యారేజీలతో పాటు మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణానికి సంబంధించి చెన్నై హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈనెల 11న విచారణ చేపట్టనుంది. సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు మేరకు తొలుత ఢిల్లీ ఎన్జీటీ ధర్మాసనం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖలను ధర్మాసనం ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.