Telangana

News April 1, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.9,54,200 సీజ్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,28,66,780 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేశామన్నారు. 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.9,54,200 పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్

image

ప్రభుత్వ టీచర్లకు టెట్ ఫీవర్ పట్టుకుంది. టీచర్ ఎలిజిబిలీటీ టెస్ట్ పాస్ అయితేనే ప్రమోషన్ అని గత సంవత్సరం హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గతంలో పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. గత నోటిఫికేషన్లకు భిన్నంగా.. ఈసారి దరఖాస్తులో టీచర్లకు ప్రత్యేకంగా కాలం పెట్టీ వారి వివరాలు కూడా అడుగుతుంది. ప్రమోషన్లకు లైన్లో టీచర్లు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు.

News April 1, 2024

హైదరాబాద్‌లో కేటుగాళ్ల కొత్త మోసం ఇదే..!

image

HYDలో డబుల్ బెడ్ రూమ్ అర్హులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి రూ.1,250 ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కరెంట్, నీటి సదుపాయాలు కల్పించి ఇళ్లలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తామన్నారు. గృహ ప్రవేశం సమయంలో తిరిగి మీ నగదు వాపస్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 1, 2024

హైదరాబాద్‌లో కేటుగాళ్ల కొత్త మోసం ఇదే..!

image

HYDలో డబుల్ బెడ్ రూమ్ అర్హులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి రూ.1,250 ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కరెంట్, నీటి సదుపాయాలు కల్పించి ఇళ్లలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తామన్నారు. గృహ ప్రవేశం సమయంలో తిరిగి మీ నగదు వాపస్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

News April 1, 2024

MNCL: ఈనెల 3 నుంచి పదవ తరగతి మూల్యాంకనం

image

మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే మూల్యాంకనం నిర్వహణకు ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్కూల్ అసిస్టెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలో సెల్ ఫోన్లు వాడవద్దని సూచించారు.

News April 1, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.9,54,200 సీజ్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,28,66,780 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేశామన్నారు. 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.9,54,200 పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 1, 2024

పెబ్బేరు మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం

image

వనపర్తి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరులోని మార్కెట్ యార్డు గోదాంలో మంటలు చలరేగి గన్నీ సంచులు దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు ఫైర్‌ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

KNR: కిటకిటలాడుతున్న జిల్లా గ్రంథాలయం, స్టడీ సర్కిల్స్

image

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం, స్టడీ సర్కిల్స్ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకే గ్రంథాలయం అభ్యర్థులతో నిండిపోతోంది. వరుసగా నోటిఫికేషన్లు రావడంతో జిల్లాలోని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు దక్కించుకునేందుకు ప్రణాళికబద్ధంగా చదువుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.

News April 1, 2024

HYD: కుటుంబ కలహాలతో జర్నలిస్టు రఘు ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతంలో ఈటీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న రఘు కుటుంబ కలహాలతో నేడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రాలేదు. జర్నలిస్టు మృతితో ఆయా సంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

News April 1, 2024

55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చాం: కిషన్ రెడ్డి

image

పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకని హేళన చేశారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పేదలు దాదాపు రూ.2 లక్షల కోట్లు పొదుపు చేశారని తెలిపారు. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామని తెలిపారు.