Telangana

News April 1, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో అంగన్వాడీ ఆయా మృతి

image

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో దండబోయిన మణేమ్మ (40) అనే అంగన్వాడీ ఆయా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తనే హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రామారెడ్డి పోలీసులకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యనా..? హత్యనా అనే కోణంలో పోలిసులు విచారణ చేపట్టారు. మణెమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News April 1, 2024

అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి: మంత్రి సీతక్క

image

బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు. మతతత్వ రాజకీయాలు చేసి బీజేపీ ని ఓడించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ తదితరులున్నారు.

News April 1, 2024

MNCL: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ సమీపంలోని వాగులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం నర్సాపూర్ సమీపంలోని చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక పోలీసులు బయటకు తీసినట్లు సమాచారం. మృతదేహానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

అడ్డాకుల: ఉచిత బస్సులో కరువు పనికి

image

అడ్డాకుల మండలం శాగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు గ్రామ శివారు కందూర్ స్టేజ్ దగ్గరకు కరువు పనులకు వెళ్లారు. పనులు పూర్తయిన వెంటనే దాదాపు 12:30కు ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన వచ్చింది. ఇంతలో మహబూబ్‌నగర్ నుంచి వనపర్తికి వెళ్లే పల్లెవెలుగు బస్సు కందూర్ స్టేజ్ దగ్గర ఆపడంతో గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు బస్సు ఎక్కారు.

News April 1, 2024

HYD: భారీగా నగదు కట్టలు సీజ్   

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.

News April 1, 2024

HYD: భారీగా నగదు కట్టలు సీజ్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.

News April 1, 2024

WGL: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగుజాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు.

News April 1, 2024

క‌డియం శ్రీహ‌రి ప‌ద‌వికి రాజీనామా చేయాలి: హ‌రీశ్‌రావు

image

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన క‌డియం శ్రీహ‌రి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా పార్టీ వీడుతున్న వారిపై మండిపడ్డారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీహ‌రికి తగిన గుణ‌పాఠం చెప్పాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు.

News April 1, 2024

 MBNR: ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.10 లక్షలతో పరారీ

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి పరారైన ఘటన MBNR జిల్లాలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో పంజాగుట్ట PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

News April 1, 2024

HYD: ‘అధిక ధరలు వసూలు చేస్తే.. ఫిర్యాదు చేయండి’

image

గ్రేటర్ HYDలో గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ తెలిపారు. గ్యాస్ డోర్ డెలివరీ ఆలస్యం చేయడంతో వినియోగదారులే డీలర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ ధరకు రూ.1 అధికంగా అడిగినా అక్కడే నిలదీయాలని, వినకుంటే తమకు Xలో ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు.