Telangana

News April 1, 2024

HYD: సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి

image

టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్.. కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2024

HYD: సామ రామ్మోహన్ రెడ్డికి కీలక పదవి

image

టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్.. కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

News April 1, 2024

KNR: మిర్చి బండి మహిళతో KTR ముచ్చట్లు

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.

News April 1, 2024

NZB: ‘A’ సర్టిఫికెట్ సినిమాలకు మైనర్లకు నో ఎంట్రీ

image

‘A’ సర్టిఫికేట్ పొందిన సినిమాలను చూడటానికి మైనర్‌లను సినిమా థియేటర్లలోకి అనుమతించకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ శింగేనవార్ అన్నారు. వ్యక్తులుగానీ, యాజమాన్యం గాని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం థియేటర్ గేట్ల ముందు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.

News April 1, 2024

యాదాద్రి: రైల్వే ట్రాక్‌పై మృతదేహం

image

వలిగొండ మండలం టేకులసోమారం సమీపన రైల్వే ట్రాక్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంటున్నారని రైల్వే ఎస్సై సాలకమ్మ తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

కొల్లాపూర్: అడుగంటుతున్న కృష్ణా జలాలు !

image

కృష్ణానదిలో జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ రోజురోజుకూ తగ్గుతోంది. జనవరి నెలాఖరులో 829 అడుగులు ఉన్న బ్యాక్‌ వాటర్‌ ప్రస్తుతం 811 అడుగులకు చేరుకుంది. దీంతో సాగునీటి అవసరాలకు ఇప్పటికే నీటి ఎత్తిపోతలు నిలిపివేయగా, కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు లేవని అధికారులు అంటున్నారు. మరోవైపు పంటలు ఎండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News April 1, 2024

MBNR: ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ..!

image

మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల నాయకులలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 28న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రేపు ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్‌తో ఉన్నారు. పైకి గెలుపు మీద ధీమాతో ఉన్నప్పటికీ లో లోపల మాత్రం ఆందోళనలో ఉన్నారు.

News April 1, 2024

చర్ల: ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లా తెట్టమడుగు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. దీన్ని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఆప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, నక్సల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News April 1, 2024

తెలంగాణలో రాక్షస పాలన సాగించిన బీఆర్ఎస్: ఎమ్మెల్యే వివేక్

image

తెలంగాణలో రాక్షస పాలన సాగించిన బిఆర్ఎస్‌కు గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. పీర్లపల్లిలో శ్రీ మల్లికార్జున ఆలయ ప్రతిష్ఠోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం లోకసభ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్తారని, ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు.

News April 1, 2024

HYD: దూకుడు పెంచిన మజ్లిస్‌ పార్టీ

image

పార్లమెంట్‌ ఎన్నికల కోసం మజ్లిస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్‌ పార్టీ.. రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి సైతం పోలింగ్‌ పెంపుపై దృష్టి సారించింది.