India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి సంబంధం చెడగొట్టడానికి యత్నించిన యువకులపై కేసు నమోదైంది. నల్గొండలోని ఓ కాలనీకి చెందిన యువతికి పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. తనకు ఈ పెండ్లి ఇష్టం లేదని ఆ యువతి ఇంటి పక్కన ఉండే తెలిసిన యువకుడికి చెప్పింది. అతడు మరో స్నేహితుడి సహాయంతో ఈ నెల 16న పెళ్ళి కొడుడికి ఫోన్ చేసి యువతిని పెళ్లి చేసుకోవద్దని, అమ్మాయి మైనర్ అని బెదిరించారు. యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది రేషన్ డీలర్లు, బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేయడానికి సాహసించడం లేదు. రేషన్ బియ్యం కొనుగోలు చేయలేమంటూ తెగేసి చెబుతుండటం గమనార్హం.
HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం రూ.7025 పలికిన క్వింటా పత్తి ధర నేడు రూ.7,150 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
అగ్నిమాపక శాఖలో కొత్తగా చేరి శిక్షణ పూర్తి చేసుకున్న 483 ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ నేడు జరగనుంది. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఇటీవల డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన 157 మంది అభ్యర్థులు కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.
అగ్నిమాపక శాఖలో కొత్తగా చేరి శిక్షణ పూర్తి చేసుకున్న 483 ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ నేడు జరగనుంది. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఇటీవల డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన 157 మంది అభ్యర్థులు కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకానికి 8.50 లక్షల దరఖాస్తులు రాగా.. ఐదు లక్షల కనెక్షన్ల వరకు ప్రస్తుతం అధికారులు జీరో బిల్ నమోదు చేస్తున్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో కొంత మందికి అర్హత ఉన్నా ఈ పథకంలో లబ్ధి చేకూరడం లేదు. ఉమ్మడి జిల్లాలో జీరో బిల్ నమోదు చేయడం వల్ల రూ.350 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోంది.
NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 1వ ఠాణా ఫోన్ల రికవరీలో నంబర్ 1గా నిలిచింది. ఫోన్లు చోరీకి గురైన, పోగొట్టున్న వారి నుంచి 1,432 ఫిర్యాదులు రాగా వాటిలో 904 సెల్ ఫోన్లను గుర్తించారు. అందులో 504 మంది బాధితులకు ఫోన్లు అందించడంతో 1వ ఠాణా ప్రథమ స్థానంలో నిలిచింది. KMR జిల్లాలోని బాన్సువాడ పోలీస్ స్టేషన్ 303 ఫోన్లు రికవరీ చేసి 13వ స్థానం, కామారెడ్డి పట్టణ ఠాణా 206 ఫోన్లు రికవరీ చేసి 21 స్థానంలో నిలిచాయి.
హనుమకొండలోని నయీమ్ నగర్కు చెందిన కామ మాధవి హాసన్పర్తి మండలం మడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భర్త వెంకటేశ్తో కలిసి లక్ష్మి సాయి చిట్స్ పేరుతో చిట్టీలు నడిపారు. గడువు ముగిసినా పలువురికి చిట్టి డబ్బులు చెల్లించకపోవడంతో కృష్ణ అనే ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మాధవి, ఆమె భర్తను రిమాండ్కు తరలించారు.
Sorry, no posts matched your criteria.