Telangana

News April 1, 2024

HYD: RRR మార్గంలో మార్పులు!

image

రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. RRR ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లా పరిధిలో అలైన్‌మెంట్‌లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో DPRలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

News April 1, 2024

HYD: RRR మార్గంలో మార్పులు!

image

రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో సాగు భూములు కోల్పోకుండా, రైతులకు నష్టం వాటిల్లకుండా రూట్ మ్యాప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. RRR ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లా పరిధిలో అలైన్‌మెంట్‌లో ఈ మార్పులు జరగనున్నట్టు సమాచారం. అధికారులు ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అలైన్‌మెంట్ మార్పుతో DPRలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

News April 1, 2024

పదివేల ఏళ్ల నాటి ఆదిమానవుడి చిత్రాలు

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్ పూర్ శివారులోని పాండవుల గుట్టపై సుమారు పదివేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నట్లు హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేపీ రావు పేర్కొన్నారు. పాండవుల గుట్టపై ఉన్న చిత్రాలను పరిశోధక విద్యార్థి ప్రవీణ్ రాజ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. బృహత్ శిలా యుగంలో చిత్రాలను గీసినట్లు ఆయన వివరించారు.

News April 1, 2024

MBNR: రేపే ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

image

MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లో ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “ఈనెల 2న ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, లెక్కింపు సిబ్బంది ఉదయం 6.30 గంటల్లోగా రిపోర్టు చేయాలని ఆదేశించారు.

News April 1, 2024

HYD: మల్లారెడ్డి VS మైనంపల్లి

image

మల్కాజిగిరిలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావుపై తన అల్లుడిని నిలబెట్టి మల్లారెడ్డి గెలిపించుకున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మైనంపల్లికి అధిష్ఠానం అప్పగించగా కచ్చితంగా గెలిపిస్తానన్నారు. అయితే మల్కాజిగిరిలో BRSను గెలిపిస్తానని ఇటీవల మల్లారెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 1, 2024

HYD: మల్లారెడ్డి VS మైనంపల్లి

image

మల్కాజిగిరిలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావుపై తన అల్లుడిని నిలబెట్టి మల్లారెడ్డి గెలిపించుకున్నారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మైనంపల్లికి అధిష్ఠానం అప్పగించగా కచ్చితంగా గెలిపిస్తానన్నారు. అయితే మల్కాజిగిరిలో BRSను గెలిపిస్తానని ఇటీవల మల్లారెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 1, 2024

KCR పర్యటన అంత స్క్రిప్టెడ్: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

image

దేవరుప్పుల మండలంలో కేసీఆర్ పర్యటన విడ్డూరంగా ఉందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. కేసీఆర్ పర్యటించిన పొలంలో వరుసగా నాలుగు బోర్లు వేయడం అనుమానంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు గతంలో చూసిన పొలాలు మళ్ళీ చూడటం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ పర్యటన అంతా స్క్రిప్టెడ్ అని ఆరోపించారు. కావాలనే నీటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు.

News April 1, 2024

అలంపూర్: త్రైమాసిక ఆదాయం రూ.2.62కోట్లు

image

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలకు వచ్చిన త్రైమాసిక ఆదాయం రూ.2,62,58,346 సమకూరిందని ఆలయ ఈఓ పురేంద్ర కుమార్ తెలిపారు. 2024 సంవత్సరంలో ఆదాయం బాగా పెరిగిందన్నారు. ఉచిత బస్సుల ప్రయాణం కారణంగా భక్తుల సంఖ్య కూడా బాగా పెరిగిందన్నారు. వివిధ ఆర్జిత సేవ హుండి అన్నదానం ద్వారా ఈ ఆదాయం సమకూరిందన్నారు.

News April 1, 2024

MBNR: 80శాతం మంది టెట్ లేని టీచర్లు !

image

విద్యా శాఖ ఆధ్వర్యంలో టెట్‌కు మార్చి 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా ఏప్రిల్ 10 వరకు గడువు ఉంది. కాగా ఉమ్మడి జిల్లాలో 13,266 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వారిలో దాదాపు 80% మందికి టెట్ లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టత లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.

News April 1, 2024

సిద్దిపేట యువతికి UK టైటిల్‌

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు యూకేలో టైటిల్ కొట్టింది. సుహానీరావు ‘మిస్‌ టీన్‌ గెలాక్సీ పేజెంట్‌ యూకే టైటిల్‌’ గెలిచిన మొదటి దక్షిణాసియా వాసిగా నిలిచింది. దీంతో అమెరికాలో జరిగే గెలాక్సీ ఇంటర్నేషనల్‌ పోటీల్లో యూకే తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. మార్చిలో UKలోని వారింగ్‌టన్‌లోని పార్‌ హాల్‌లో 25 మంది యువతులతో పోటీపడింది.
-CONGRATS