Telangana

News April 1, 2024

HYD: లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య 

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలానగర్ వాసి పి.నరేందర్(42) మెడికల్ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం భార్యకు ఫోన్ చేసి మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు లాడ్జిలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అనంతరం పురుగు మందు తాగి చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 1, 2024

ఆదిలాబాద్‌లో ఈసారి గెలుపెవరిది..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటడంతో ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. గత మూడు పర్యాయాల్లో ఫలితాలను పరిశీలిస్తే ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవలేదు. 2009లో TDP, 2014లో BRS, 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీ-గోడం నగేశ్, బీఆర్ఎస్-ఆత్రం సక్కు, కాంగ్రెస్-ఆత్రం సుగుణ బరిలో ఉండగా.. మన ఆదిలాబాద్‌ ప్రజలు ఈసారి ఎటువైపు ఉంటారో చూడాలి.

News April 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.200 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 1, 2024

సూర్యాపేట జిల్లాలో పోలీస్ యాక్ట్

image

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి 30 రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని కోరారు. ఎన్నికల నిబంధనలకు అందరూ సహకరించాలని సూచించారు.

News April 1, 2024

HYD: ఆస్తి పన్ను రూ.1914.87 కోట్లు వసూలు

image

ఆస్తి పన్ను వసూళ్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలం మయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్‌ను కమిషనర్ ఖరారు చేయగా.. దాదాపుగా రూ.1914.87 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 90 శాతం వడ్డీ రాయితీతో ఓటీఎస్ స్కీంను తీసుకొచ్చారు. అయినా కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై మీ కామెంట్.

News April 1, 2024

HYD: ఆస్తి పన్ను రూ.1914.87 కోట్లు వసూలు

image

ఆస్తి పన్ను వసూళ్ల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలం మయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్‌ను కమిషనర్ ఖరారు చేయగా.. దాదాపుగా రూ.1914.87 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 90 శాతం వడ్డీ
రాయితీతో ఓటీఎస్ స్కీంను తీసుకొచ్చారు. అయినా కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై మీ కామెంట్.

News April 1, 2024

MBNR: ‘విద్యుత్ శాఖలో ఆర్టిజన్లకు పని ఎక్కువ.. జీతాలు తక్కువ’

image

విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు పని భారం ఎక్కువ, వేతనాలు తక్కువగా ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. 2017లో రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తున్నట్లు ప్రకటించి వారికి సపరేట్ స్టాండింగ్ రూల్స్ ఇచ్చారు. దీంతో ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు రకాల సర్వీస్ రూల్స్ కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 వేల మంది కార్మికులు ఉన్నారు.

News April 1, 2024

KTDM: ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోల లెటర్ 

image

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను తన్ని తరమండి అంటూ ఆదివారం మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ చర్ల విలేకరులకు లేఖను పంపారు. ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని, బీజేపీ ఈసారి కూడా దేశంలో తమదే అధికారం అని విర్రవీగుతుందని లేఖలో పేర్కొన్నారు. బూటకపు పార్లమెంటు ఎన్నికలను తరిమి కొట్టండి అంటూ మావోయిస్టు కార్యదర్శి ఆజాద్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

News April 1, 2024

వరంగల్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. తమ్మిశెట్టి తిరుపతి(22) ఆటో నడుపుకుంటూ దేశాయిపేట ఎన్పీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి.. అతడి చూసి స్థానికుల సాయంతో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

కరీంనగర్: కాంగ్రెస్ MP టికెట్ ఎవరికీ?

image

కరీంనగర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ మాత్రం రోజుకొక పేరుతో చర్చలో నిలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు సీనియర్ లీడర్లే మరి కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.