Telangana

News April 1, 2024

తెగిపోయిన నిజాంసాగర్ కట్ట.. జర్నలిస్ట్ కాలనీలోకి నీళ్లు

image

ఆర్మూర్‌లోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ 82-2 కో నంబర్ ప్రధాన కాలువ కట్ట సోమవారం తెల్లవారుజామున తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకుని ఉన్న జర్నలిస్ట్ కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రైతుల పంటల సాగు కోసం నీటిని చెరువులకు వదిలే సమయంలో ప్రాజెక్టు ప్రధాన కాలువలను ఇరిగేషన్ అధికారులు శుభ్రం చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని కాలనీవాసులు పేర్కొన్నారు.

News April 1, 2024

HYD: అదనంగా మరో 87 ట్యాంకర్లు..

image

గ్రేటర్ HYDలో తాగునీటి సమస్యను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా 5వ తేదీ నాటికి మరో 87 ట్యాంకర్లు అదనంగా సమకూర్చుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు.

News April 1, 2024

HYD: అదనంగా మరో 87 ట్యాంకర్లు..

image

గ్రేటర్ HYDలో తాగునీటి సమస్యను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా 5వ తేదీ నాటికి మరో 87 ట్యాంకర్లు అదనంగా సమకూర్చుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు.

News April 1, 2024

హైదరాబాద్ @ 38.2 డిగ్రీలు నమోదు

image

హైదరాబాద్, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.3 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో రాగల రెండు, మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 1, 2024

హైదరాబాద్ @ 38.2 డిగ్రీలు నమోదు

image

హైదరాబాద్, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.3 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో రాగల రెండు, మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News April 1, 2024

పోడు వివాదం.. 19 మంది మహిళలు రిమాండ్

image

సత్తుపల్లి మండలం బుగ్గపాడు సమీపంలోని చంద్రాయపాలెం పోడు వివాదంలో సీఐ టి.కిరణ్, పోలీసులపై దాడి ఘటనలో 19 మంది మహిళలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే, మరికొందరు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు చెప్పారు. వివాదంలో ముఖ్య భూమిక పోషించిన మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్ర కోసం గాలింపు ముమ్మరం చేశామని ఏసీపీ రఘు తెలిపారు. వీరి కోసం పలువురి ఇళ్లలోనూ సోదా చేశారు.

News April 1, 2024

HYD: మిర్చి బండి మహిళతో KTR ముచ్చట్లు

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.

News April 1, 2024

HYD: మిర్చి బండి మహిళతో KTR ముచ్చట్లు

image

HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.

News April 1, 2024

42.4°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

image

భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి భగభగలతో బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే క్రమేణా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లి మండలంలో సండే రోజు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 1, 2024

కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా..?

image

కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా ..? అని మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అధోగతికి మీరు కారణం కాదా అని ప్రశ్నించారు.