Telangana

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

♥నేటి నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
♥పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు
♥నేటి రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(సోమ):6:37,సహార్(మంగళ):4:50
♥పలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేల&MBNR,NGKL ఎంపీ అభ్యర్థుల పర్యటన
♥అచ్చంపేట:నేడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్
♥GDWL:నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
♥’TET ఫీజు తగ్గించాలని పలుచోట్ల నిరసనలు’
♥నేడు సమీక్ష.. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
♥పలుచోట్ల ‘ఇఫ్తార్ విందు’!

News April 1, 2024

MBNR: జీతాలు రాక.. ఉపాధి సిబ్బంది ఇబ్బందులు

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడంలేదని తెలిపారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 155 ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నెలనెలా ఖాతాలో జీతాలు పడేటట్లు చేయాలని జాతీయ ఉపాధి హామీ సిబ్బంది కోరారు.

News April 1, 2024

7న సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష

image

మహబూబ్ నగర్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల సైనిక పాఠశాల, కళాశాల (అశోక్ నగర్-వరంగల్)లో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి కె.నాగార్జునరావు తెలిపారు. హాల్ టికెట్లు ఏప్రిల్ 1 నుంచి 4 వరకు నిర్దేశిత వెబ్సైట్ www.tgtwguruculam.telangana.gov.in లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.

News April 1, 2024

సిద్దిపేట: రిజర్వాయర్లలో అడుగంటిన జలాలు

image

సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో భూగర్భజలాలు అడుగంటాయి. అన్నపూర్ణ రిజర్వాయర్‌ సామర్థ్యం 3.5టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.84 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డెడ్‌ స్టోరేజీకి చేరి ఈ రిజర్వాయర్‌ ఎడారిని తలపిస్తుంది. రిజర్వాయర్‌ కింద పంటలు ఎండిపోవడంతో దేవుడా ఇదేం దుస్థితి అని రైతులు బోరున విలపిస్తున్నారు. రంగనాయక సాగర్‌ సామర్థ్యం 3టీఎంసీలు కాగా, ప్రస్తుతం టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్‌స్టోరేజీకి చేరింది.

News April 1, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా లో TODAY HEADLINES

image

∆} వివిధ శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాద్రి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు
∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

News April 1, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: ఈటల

image

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఉండాలని గతంలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. HYD నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఈటల మాట్లాడారు. దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.

News April 1, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు: ఈటల

image

ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఉండాలని గతంలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. HYD నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఈటల మాట్లాడారు. దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.

News April 1, 2024

SRD: ‘ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలి’

image

ఎన్నికల్లో అక్రమాలపై పౌరులు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి చూసించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సి-విజిల్ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం, మతపరమైన ప్రసంగాలు తదితరాలపై సి-విజిల్ యాప్ ద్వారా జిల్లా యంత్రాంగానికి తెలపాలన్నారు. ఫిర్యాదుకు ఫొటోలు, వీడియోలు జత చేయాలని, 100 నిమిషాల్లో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

News April 1, 2024

గూడూరు: ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్?

image

బాలుర హైస్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని డీఈఓ రామారావు శనివారం తనిఖీ చేశారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రంలోని ఓ గదిలో ఉపాధ్యాయురాలు సెల్ ఆపరేట్ చేస్తూ డీఈఓకు కనిపించారు. నిబంధనలకు విరుద్దంగా ముగ్గురు ఇన్విజిలేటర్లు, ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు సెల్ ఫోన్స్ తీసుకురావడాన్ని గమనించి వారిని సస్సెండ్ చేసినట్లు సమాచారం.ఈ విషయాన్ని డీఈఓ కలెక్టర్‌కి తెలియజేశారు.

News April 1, 2024

NZB, ZHB నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు వీరే..!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సుదర్శన్ రెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జిగా దామోదర్ రాజ నర్సింహను నియమించారు.