Telangana

News April 1, 2024

KNR: BJP నాయకులపై కేసు నమోదు

image

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI నరేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నేరువరం మండలం మాదాపూర్‌లో EGS పథకంలో సీసీ రోడ్డు నిర్మాణం ఆదివారం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ARO కిరణ్ ఆదేశాల మేరకు FST టీమ్ ఇన్‌ఛార్జ్ రాజశేఖర్ పరిశీలించి BJP నాయకులు తిరుపతి, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ ప్రారంభించారని నిర్ధారించారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News April 1, 2024

HYD: శిల్పారామంలో నృత్యంతో అలరించిన కళాకారులు

image

కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో సందర్శకులను అలరించారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆదివారం శ్రీగురు నాట్యాలయం గురువు శ్రీలక్ష్మీ నల్లమోలు శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శనను నిర్వహించారు. ఇందులో గణేశ వందన, గణేశ పంచరత్న, బ్రహ్మంజలి, నటేశకౌతం, హనుమాన్‌ చాలీసా, స్వరజతి, శివస్తుతి, రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, కళింగనర్తన, తిల్లాన తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News April 1, 2024

HYD: శిల్పారామంలో నృత్యంతో అలరించిన కళాకారులు

image

కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో సందర్శకులను అలరించారు. HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఆదివారం శ్రీగురు నాట్యాలయం గురువు శ్రీలక్ష్మీ నల్లమోలు శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శనను నిర్వహించారు. ఇందులో గణేశ వందన, గణేశ పంచరత్న, బ్రహ్మంజలి, నటేశకౌతం, హనుమాన్‌ చాలీసా, స్వరజతి, శివస్తుతి, రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, కళింగనర్తన, తిల్లాన తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

News April 1, 2024

పాల్వంచ: టెక్నాలజీ సాయంతో బంగారు నగల పట్టివేత

image

టెక్నాలజీ సాయంతో ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న బంగారాన్ని పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎంజీ రోడ్ కు చెందిన సూరిబాబు పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చాడు. తిరిగి ఆటోలో వెళుతున్న క్రమంలో 8 తులాల బంగారు నగలు, సెల్ ఫోన్ ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. బాధితుడి మొబైల్ లోకేషన్ ఆధారంగా బ్యాగును గుర్తించారు.

News April 1, 2024

మల్కాజిగిరిలో BRS ‘పక్కా లోకల్’ వ్యూహం

image

మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.

News April 1, 2024

మల్కాజిగిరిలో BRS ‘పక్కా లోకల్’ వ్యూహం

image

మల్కాజిగిరిలో గెలుపే లక్ష్యంగా BRS నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ‘పక్కా లోకల్’ అనే నినాదాన్ని వారు ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి వికారాబాద్ నుంచి వచ్చారని, BJPఅభ్యర్థి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి వచ్చారని కానీ BRSఅభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ‘పక్కా లోకల్’ అంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, BJP సైతం తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి.

News April 1, 2024

నేడు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల !

image

తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు ఈరోజు నీటిని విడుదల చేయనున్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దదేవులపల్లి, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లను నింపడానికి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్ఎస్పీ అధికారులకు ఎస్సీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కేవలం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు సమాచారం.

News April 1, 2024

MBNR: పార్టీ మారుతున్న నేతలు, అయోమయంలో అభ్యర్థులు

image

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు అయోమయంలో పడ్డారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి‌తో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

News April 1, 2024

నిజామాబాద్‌లో రంజాన్ సందడి.. రాత్రంతా కొనుగోళ్లు

image

రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటు చూసిన సందడి వాతావరణం నెలకొంది. రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి రాత్రంతా దుకాణాలతో వీధులు, ఫుట్ పాత్‌లో కొనుగోలుదారులతో సందడిగా మారాయి. పగలు భారీగా ఎండ ఉండటంతో రాత్రి వేళల్లో రంజాన్ షాపింగ్ చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. మీ ప్రాంతంలో రంజాన్ సందడి ఎలా ఉందో కామెంట్ చేయండి.!

News April 1, 2024

జహీరాబాద్‌లో BRS గెలుపు ఖాయం: హరీశ్‌రావు

image

జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థాయి BRS కార్యకర్తల సమావేశం లింగంపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. జహీరాబాద్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.