India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లగొండ: వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలనీ, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తుంటారని తెలిపారు.
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా ఎంబి కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్టర్ వేడుకకు పార్లమెంటరీ అభ్యర్థులు డీకే అరుణ(బీజేపీ), చల్లా వంశీచంద్ రెడ్డి(కాంగ్రెస్), మన్నే శ్రీనివాస్ రెడ్డి(బీఆర్ఎస్) హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆప్యాయతను కనబరిచారు. అభ్యర్థులను చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో చర్చి సభ్యులు పాల్గొన్నారు.
@ మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర. @ గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకుల ధర్నా. @ చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అరెస్ట్. @ సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కరీంనగర్ లో కాలభైరవ స్వామిని దర్శించుకున్న ఎంపీ బండి సంజయ్. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి.
HYD అంబర్పేట్లో మాజీ మంత్రి KTR పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. KTR వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ ఉన్నారు. BRS పార్టీ తెలంగాణ ప్రజలదని, దానిని గెలిపించి పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించేలా చేయాలని పిలుపునిచ్చారు.
HYD అంబర్పేట్లో మాజీ మంత్రి KTR పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. KTR వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ ఉన్నారు. BRS పార్టీ తెలంగాణ ప్రజలదని, దానిని గెలిపించి పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించేలా చేయాలని పిలుపునిచ్చారు.
మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ రోడ్డు వద్ద ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు గుడి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. అమ్మవారి బంగారు ముక్కుపుడక, బొట్టు బిల్ల , హుండీలోని డబ్బులు సుమారు రూ.6వేలు దొంగలించినట్లు వెల్లడించారు. పోలీసుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
✏WNPT: కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు
✏MLC ఎన్నిక.. చెల్లుబాటు ఓట్లను బట్టి గెలుపు నిర్దారణ:MBNR కలెక్టర్
✏నేను బహుజన ద్రోహిని కాదు:RS ప్రవీణ్ కుమార్
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఈస్టర్ వేడుకలు.. పాల్గొన్న MLAలు
✏MBNR:రేపటి నుంచి తైబజార్ రద్దు
✏ఇఫ్తార్ విందులో పాల్గొన్న.. స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✏కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం:BSP
ఉమ్మడి పాలమూరులో భానుడు మండుతున్నాడు. దీంతో వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండటంతో పేద, ధనిక తేడా లేకుండా వీటికి గిరాకీ పెరిగింది. సైజును బట్టి రూ.160 నుండి రూ.400 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD కాచిగూడ డివిజన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాయన్నారు. కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.