Telangana

News July 25, 2024

కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ ద్వారా టెండర్ల ఆహ్వానం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజియన్, ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు పరిధిలో ఉన్న కమర్షియల్ షాప్‌లకు ఆన్లైన్ విధానంలో టెండర్ల ను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం Dy.RM(O) G.N పవిత్ర తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 23 నుంచి ఆగస్టు 8 వరకు అధికారిక వెబ్ సైట్ https://tender.telangana.gov.in (tender) లో టెండర్ వేయవచ్చని మరిన్ని వివరాలకు , 9963507506 సంప్రదించాలని సూచించారు.

News July 25, 2024

సిద్దిపేట: ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సాధించింది గుండు సున్నా’ ఫ్లెక్సీలు

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని విమర్శనాత్మకంగా ‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సాధించింది గుండు సున్నా’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని సిద్దిపేటలో కొన్ని చోట్ల BRS నాయకులు ప్రదర్శనగా పెట్టారు. మోడ్రన్ బస్టాండ్ వద్ద ఈ ఫ్లెక్సీ ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. రెండు జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి ఎలాంటి నిధులు సాధించలేదని విమర్శించారు.

News July 25, 2024

WGL: బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీలు

image

నక్కలపల్లిలోని ఓ బార్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మటన్, చికెన్ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బార్‌లోని వంటగదికి అనుమతులు లేకుండానే బార్ నిర్వహిస్తున్నారని, సరైన శుభ్రత లేకుండా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడులతో బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు బార్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

News July 25, 2024

వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి బుధవారం క్వింటాకు రూ.17,200 పలకగా.. నేడు రూ.18,000కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు కూడా రూ.13,300 పలికింది. ఐతే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం భారీగా తగ్గింది. నిన్న రూ.16,000 వచ్చిన ధర.. ఈరోజు రూ.13,500కి పతనమైంది.

News July 25, 2024

NLG: రైతు బీమాకు ఆగస్టు 5 వరకు గడువు

image

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు వచ్చేనెల ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఏఓ పాల్వాయి శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామాల ఏఈఓలకు అందజేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 25, 2024

MBNR: గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా గురుకుల సెంటర్లల్లో ఈనెల 26న బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2024 మార్చిలో టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
SHARE IT..

News July 25, 2024

HYD: మూడో తరగతి చదువుతున్న అంధ బాలికపై అత్యాచారం!

image

HYDలో దారుణ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన అంధ బాలిక(8) మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఇటీవల చిన్నారికి రక్తస్రావం కావడంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి ఆమెను వైద్యులకు చూపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వారు నిర్ధారించారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే యువకుడి(23)పై అనుమానంతో PSలో ఫిర్యాదు చేశారు.

News July 25, 2024

HYD: మూడో తరగతి చదువుతున్న అంధ బాలికపై అత్యాచారం!

image

HYDలో దారుణ ఘటన జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన అంధ బాలిక(8) మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్‌లో మూడో తరగతి చదువుతోంది. ఇటీవల చిన్నారికి రక్తస్రావం కావడంతో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి ఆమెను వైద్యులకు చూపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వారు నిర్ధారించారు. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే యువకుడి(23)పై అనుమానంతో PSలో ఫిర్యాదు చేశారు.

News July 25, 2024

ఉమ్మడి జిల్లాలో తగ్గిన వర్షపాతం

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు వర్షపాతం తగ్గుతూ వస్తోంది. గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా అమరచింతలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మొహ్మదాబాద్ లో 5.0 మి.మీ, నారాయణపేట జిల్లా కృష్ణలో 2.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండలో 2.8 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 25, 2024

MDK: గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

image

రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హత్నూర గురుకులంలో రేపు బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 10వ తరగతి 2024 మార్చిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.