Telangana

News March 31, 2024

గద్వాల: నేను బహుజన ద్రోహిని కాదు: RSP

image

నేను బహుజన ద్రోహిని కాదని RS ప్రవీణ్ కుమార్ అన్నారు. నేడు గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొంతమంది నన్ను బహుజన ద్రోహిని అని అంటున్నారు. నేను నిజంగా బహుజన ద్రోహినే అయితే ఎన్నో పదవులను అనుభవించే వాడిని. బహుజన జాతికి సేవ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చా’ అని RSP క్లారిటి ఇచ్చారు.

News March 31, 2024

3 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

image

పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్లో ఏప్రిల్ 3 నుంచి 11 వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. 9రోజుల వ్యవధిలో 1,48,000 జవాబు పత్రాలను దిద్దనున్నారు. పత్రాలను దిద్దేందుకు 600 అసిస్టెంట్ ఎగ్జామినర్లను , 200 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతిరోజు ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు 40 పేపర్లు దిద్దేందుకు ఇవ్వనున్నారు.

News March 31, 2024

అత్యధికంగా ఖమ్మం నుంచే రు.108.65 కోట్ల ఆదాయం

image

జిల్లాలో ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 47,102 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయగా రూ.227.34కోట్ల ఆదాయం వచ్చింది. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోనే అత్యధికంగా రూ.108.65 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.

News March 31, 2024

నిజాంసాగర్: నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల

image

నిజాంసాగర్‌లోని నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి జనవరి 20న పరీక్ష నిర్వహించారు. cbseit.in వెబ్ సైట్‌లో రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

News March 31, 2024

ఉప్పల్ స్టేడియంలో దేవేందర్ గౌడ్ గేట్ ఉందని తెలుసా..?

image

HYD ఉప్పల్ స్టేడియంలో తూళ్ల దేవేందర్ గౌడ్ గేట్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? తూళ్ల దేవేందర్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు 1994, 1999, 2004లో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగానూ వ్యవహరించారు. 2003లో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు.

News March 31, 2024

ఉప్పల్ స్టేడియంలో దేవేందర్ గౌడ్ గేట్ ఉందని తెలుసా..?

image

HYD ఉప్పల్ స్టేడియంలో తూళ్ల దేవేందర్ గౌడ్ గేట్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? తూళ్ల దేవేందర్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు 1994, 1999, 2004లో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగానూ వ్యవహరించారు. 2003లో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు.

News March 31, 2024

జనగామ: బైక్ అదుపుతప్పి.. వ్యక్తి మృతి

image

జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలంలోని హక్యాతండా సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వెంకన్న అనే వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వాహనదారులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కొడకండ్ల పోలీసులు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

News March 31, 2024

PU 16ఏళ్ల చరిత్రలో 9 మందికే PhD పట్టా

image

పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతతో ఉన్నత విద్య అరకోరగా సాగుతోంది. ఇక్కడ 105 బోధనా సిబ్బంది పోస్టులు ఉండగా కేవలం 86 మంది ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న PU 16ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే పీహెచ్‌డీ పట్టా పొందడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్యాపకుల భర్తీపై దృష్టి సారిస్తేనే వర్సిటీ దశ మారే అవకాశం ఉంటుంది.

News March 31, 2024

HYD: హత్య చేసి మృతదేహాన్ని పడేసే యత్నం..!

image

HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్‌‌ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

News March 31, 2024

HYD: హత్య చేసి మృతదేహాన్ని పడేసే యత్నం..!

image

HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్‌‌ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.