Telangana

News March 31, 2024

వనవర్తి: కాంగ్రెస్‌లో చేరనున్న ఆ 8 మంది కౌన్సిలర్లు..?

image

వనపర్తి మున్సిపాలిటికి చెందిన 8 మంది BRS కౌన్సిలర్లు శనివారం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మున్సిపల్ ఛైర్మన్ పదవి ఆశిస్తున్న 13వ వార్డు కౌన్సిలర్ మహేష్ కౌన్సిలర్లతో కలిసి MLA మేఘారెడ్డితో ఆదివారం భేటీ అయి చర్చిస్తున్నట్లు సమాచారం. మహేశ్‌కు ఛైర్మన్ పదవికి కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు 8 మంది కౌన్సిలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

News March 31, 2024

మైనార్టీలకు తమ ప్రభుత్వం పెద్ద పీట: ఒబేదుల్లా

image

అణగారిన మైనార్టీల అభివృద్ది కోసం తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ వివరించారు. ఈస్టర్ పండగ సందర్బంగా ఆదివారం రెమా చర్చిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాట్లాడారు. తమ ప్రభుత్వం మైనార్టీల పక్షపాతి అని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మైనార్టీలను అణచివేయాలని చేసే శక్తుల్ని తమ ప్రభుత్వం కూకటి వ్రేళ్ళతో పెకలిస్తోందన్నారు. 

News March 31, 2024

‘ఏడాదిలోపు నిజాం ఫ్యాక్టరీని తెరిపించనున్న ప్రభుత్వం’

image

ఏడాది లోపు బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF) ని ప్రభుత్వం తెరిపించబోతుందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎన్నో ఖాయిలా ఫ్యాక్టరీలు తెరిపించారని ప్రగల్బాలు పలుకుతున్న అర్వింద్ NSFను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

News March 31, 2024

ASF: భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

image

భార్య కాపురానికి రావడం లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన రాము(25) కు సోనాపూర్ గ్రామానికి చెందిన రాంబాయితో వివాహం జరిగింది. రాము మద్యానికి బానిస కావడంతో భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. దీంతో మద్యానికి బానిసైన రాము ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 31, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రత వివరాలివే..

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా ఐనోల్లో 42.7, వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.2, NGKL జిల్లా కిష్టంపల్లిలో 41.8, MBNR జిల్లా సల్కర్పేటలో 41.7, నారాయణపేట జిల్లా మరికల్లో 40.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 31, 2024

వనపర్తి: మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి

image

నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు నుంచి పడి వాచ్‌మెన్‌ మృతి చెందాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన జి.కోటయ్య(55) నాలుగు నెలల క్రితం HYDకి వలస వచ్చారు. ఓల్డ్‌ అల్వాల్‌ పరిధి సూర్య నగర్‌‌లోని శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. మూడో అంతస్తులో నిర్మించిన గోడలకు నీరు చల్లుతుండగా కాలు జారి రెండో అంతస్తులో పడి మృతి చెందాడు.

News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

News March 31, 2024

రేపటి నుంచి వరి ధాన్యం కొనుగోలు.. కీలక ఆదేశాలు జారీ !

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు.
↪కేంద్రాల వద్ద టెంట్, తాగునీరు ఏర్పాటు చేయాలి
↪టార్పాలిన్లు,ఎలక్ట్రానిక్ కాంటా, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉండాలి
↪ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఏపీఎంలు చర్యలు తీసుకోవాలి
↪ఎన్నికల కోడ్.. ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేయరాదు.

News March 31, 2024

MBNR: బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం..!

image

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో దాగి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రెడ్డి ఈ ఎన్నికలో హోరాహోరీగా తలపడ్డారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగియగా.. విజయంపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 2న వెలువడే ఫలితాల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు.