India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చింతూరు, రంపచోడవరం డివిజన్లో అన్ని పాఠశాలలకు ఈరోజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ఏజెన్సీలో భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులను బయటకు పంపకుండా ఇళ్ల వద్దే ఉంచాలని కోరారు. ప్రైవేట్ విద్యాలయాలు కూడా సెలవు ఇవ్వాలన్నారు.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికుల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్లో యువకుడిని హత్య చేశారు. మంగళవారం రాత్రి మహమ్మద్ ఖాజా పాషా(ర్యాపిడో డ్రైవర్), అతడి స్నేహితుడు పర్శకు గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో పాషాపై కర్రతోదాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికుల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్లో యువకుడిని హత్య చేశారు. మంగళవారం రాత్రి మహమ్మద్ ఖాజా పాషా(ర్యాపిడో డ్రైవర్), అతడి స్నేహితుడు పర్శకు గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో పాషాపై కర్రతోదాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సిరిసిల్ల JNTU బిల్డింగ్, గల్ఫ్ వెళ్లిన వారి సంక్షేమం , వస్త్రోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపన ప్రస్తావన ఉంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్లో బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల ఊసే లేకపోవడంతో ఓరుగల్లుకు నిరాశే ఎదురైంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఇందులోనైనా ప్రాధాన్యం దక్కుతుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి, కేయూ అభివృద్ధి, పర్యాటక ప్రాంతాల డెవలప్ చేయాల్సి ఉంది. వరంగల్ కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా, 1978లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను నిర్మించింది.
ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దార్లు16 మంది, సినియర్. 25 మంది, జూ.అసిస్టెంట్లు 15 మంది, ఆఫీస్ సబార్డినేట్లు 18 మంది ఉన్నారు. వారితో పాటు ఐదుగురు తహశీల్దార్లకు రిలీవింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి.
గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ఇప్పుడు ప్రత్యేక కిట్టునే ఉపయోగిస్తోంది. ”గంజాయి తాగే వారిని గుర్తించేందుకు ఎబాన్ డ్రగ్ యూరిన్ టెస్టింగ్ కిట్ను ఉపయోగిస్తున్నాం. 45 రోజులైనా ఇది గంజాయి తీసుకున్న వారిని గుర్తిస్తుంది. అనుమానం వచ్చిన ప్రతీ వ్యక్తి యూరిన్ను పరీక్ష చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రతీ ఒక్క పౌరుడు సహకరించాలి” అని కోదాడ సీఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు.
మెదక్ పట్టణం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానిస్టేబుళ్లు నీరుడి రాము, యం.రవి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతోపాటు ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు అందడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా తప్పవని హెచ్చరించారు.
వీధి కుక్కలు నగరవాసులపై దాడి చేస్తోన్న ఘటనలు పెరుగుతుండటంతో GHMC కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది. రోజంతా కాల్ సెంటర్ పని చేస్తుందని, 040-21111111, 23225397 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారు. కుక్కకాటువల్ల ఇటీవల జవహర్ నగర్లో ఓ చిన్నారి చనిపోవడం, ఈ తరహా దుర్ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఇటీవల రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.