India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేక్మాల్లో ఇల్లు కూలడంతో నిద్రిస్తున్న మహిళ చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దత్తయ్య, శంకరమ్మ(60) దంపతులు శనివారం ఇంట్లో పడుకున్నారు. ఇటీవల వర్షాలతో నానిన వారి ఇల్లు కూలడంతో శంకరమ్మ నిద్రలోనే మృతిచెందింది. భర్త దత్తయ్య మరో గదిలో పడుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.
HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో ప్రధాన బ్యారేజీలతో పాటు మల్లన్న సాగర్ జలాశయ నిర్మాణానికి సంబంధించి చెన్నై హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఈనెల 11న విచారణ చేపట్టనుంది. సుమోటోగా స్వీకరించిన ఫిర్యాదు మేరకు తొలుత ఢిల్లీ ఎన్జీటీ ధర్మాసనం కాళేశ్వరంపై విచారణ చేపట్టి కేసును చెన్నై ధర్మాసనానికి బదిలీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖలను ధర్మాసనం ఆదేశించింది.
కరీంనగర్ పట్టణంలో శనివారం గణపతి ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అయితే ప్రకాష్ గంజ్లో గణపతి మొదటి పూజా కార్యక్రమంలో BJP MP, కేంద్ర మంత్రి బండి సంజయ్, BRS MLA గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. 2 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని, BSNLలో రూ.10 నుంచి రూ.3వేల వరకు ధరలతో 12 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. తీగల బంజారా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు నుంచి కొత్తగూడెం వెళ్లాలనుకునే ప్రయాణికులు తల్లాడ వైపుగా వెళ్లాలని పోలీసు అధికారులు చెప్పారు. మరొకవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.39,906 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.13,900, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.21,700, అన్నదానం రూ.3,306 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో సాయిబాబా ఆలయం పక్కన 52 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రతిష్ఠాపన పూజలో MLA సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 11 రోజుల పూజల అనంతరం మండపం వద్దనే నీళ్లతో వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పెద్దపల్లి, KNRలో భారీ గణపతులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.