India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ సుల్తానాబాద్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య. @ వేములవాడలో వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు. @ సైదాపూర్ మండలానికి చెందిన ఆర్మీ జవాన్ పంజాబ్ లో మృతి. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ వేములవాడలో వైభవంగా రాజన్న రథోత్సవం. @ నీటిని విడుదల చేయాలని కథలాపూర్ మండలంలో రైతుల ధర్నా. @ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు.
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.
HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.
HYDలో కాంగ్రెస్ క్రమంగా బలపడుతోంది. గత GHMC ఎన్నికల్లో 150 స్థానాలకు ఉప్పల్, ASరావునగర్లోనే విజయం సాధించిన కాంగ్రెస్ ఎట్టకేలకు లింగోజిగూడ బైపోల్లో గెలిచింది. ఇటీవల కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సైతం పార్టీని వీడారు. ఎన్నికల ముందు HYDలో బలహీనంగా ఉన్న INC అధికారం చేపట్టిన తర్వాత పుంజుకుంది. వరుస చేరికలతో గ్రేటర్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు డబుల్ డిజిట్(12)కు చేరారు. మరో 10 మంది చేరుతారని టాక్.
కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింధగికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీశైలానికి 50 కేజీల జొన్నల బస్తాతో కాలినడకన బయలుదేరాడు. 200 కీ.మీ దాటి గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరకు చేరుకుని సేద తీరాడు. అక్కడి స్థానికులు జొన్నల మూటపై ఆరా తీయగా తాను పండించిన జొన్నలు స్వామికి అర్పించేందుకు తీసుకు వెళుతున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరో 200 KM కాలినడకన వెళ్లాల్సి ఉంది.
✒వనపర్తి: BRSకు బిగ్ షాక్.. 8 మంది కౌన్సిలర్లు రాజీనామా
✒MBNR: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
✒‘సోషల్ మీడియాపై పోలీసుల నిఘా’
✒దౌల్తాబాద్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
✒ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కుపై అవగాహన
✒జాగ్రత్త సుమా.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
✒MBNR:ZP చైర్పర్సన్ పై వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం
✒పలుచోట్ల తనిఖీలు
ధర్మారం మండలం నంది మేడారంలో సామంతుల మహేష్ (28) శనివారం ఉదయం 1 గంట ప్రాంతంలో హత్యాయత్నానికి గురయ్యాడు. మహేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి తాత సామంతుల కొమరయ్య (66) గొడ్డలితో ముఖంపై నరికి హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు మహేష్ మేనమామ కట్ట కొమురయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై టి.సత్యనారాయణ తెలిపారు. సామంతుల కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు.
చిలిపిచేడ్ మం. బండపోతుగల్లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానేసి ఏదైనా పని చేసుకోవాలని భార్య నదియా బేగం మందలించింది. ఈ మనస్థాపంతో ఇస్మాయిల్ ఈ నెల 29న పురుగుల మందు తాగాడు. తీవ్ర అస్వస్థకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్నట్లు బీర్కూర్ SI రాజశేఖర్ తెలిపారు. మండలంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమను చూసి భయపడి పారిపోతున్న ఇద్దరిని వెంబడించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిని బోధన్కి చెందిన అబ్దుల్ ఐయాజ్ ఖాన్(36), సమీర్ ఉద్దీన్(18)లుగా గుర్తించారు. అనంతరం విచారణ చేయగా వారు బైక్ దొంగలని తేలింది. దీంతో వారి వద్ద ఉన్న 26 బైక్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
మహబూబ్ నగర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండ్లు అందించి ఉపవాస దీక్షను విరమించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.