India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి మెడికల్ కాలేజీలో 4 ప్రొఫెసర్, 13 అసిస్టెంట్ ప్రొఫెసర్, 5 సీనియర్ రెసిడెంట్ హానర్ ఓరియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 257 మంది కానిస్టేబుళ్లు బేసిక్ ట్రైనింగ్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా వన్ టౌన్, టూ టౌన్, మావల, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లలో వారికి పోలీసుల విధివిధానాలపై శనివారం అవగాహన కల్పించారు. దీని కోసం 257 మంది శిక్షణ కానిస్టేబుళ్లలను ఆయా పోలీస్ స్టేషన్లకు కేటాయించారు.
గ్రేటర్ హైదరాబాద్లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే ఆ రికార్డు బ్రేక్ అవ్వడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్లో రోజు రోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఈ నెల 28న ఏకంగా 79.48 మిలియన్ యూనిట్ల కరెంట్ను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా మే నెలలో ఈ స్థాయిలో ఉంటుందని, ఈ ఏడాది మార్చిలోనే ఆ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతేడాది అత్యధికంగా మే 19న 79.33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ ఏడాది మార్చిలోనే ఆ రికార్డు బ్రేక్ అవ్వడం గమనార్హం.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు గడ్డపై BJP జెండా ఎగరవేద్దామని మాజీ మంత్రి DK అరుణ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఊట్కూరు మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మోడీని ప్రధానిగా కాకుండా ఆపే శక్తి దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి లేదని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిల పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు, పోలింగ్ రోజు అత్యవసర సేవల విధులు నిర్వహించే అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పన పై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
దుగ్గొండి మండలం మైసంపల్లిలో సుప్రియ హత్య ఘటనలో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ రవీందర్ వెల్లడించారు. ములుగుకు చెందిన శశికాంత్, అజ్మీర శిరీష సహజీవనం చేస్తున్నారు. వీరి విషయం తెలిసిన మృతురాలు సుప్రియతో శిరీష గొడవ పడింది. ఈనెల 23న సుప్రియను కొట్టి హత్యచేసి బంగారం, వెండిని తీసుకొని పరారయ్యారని తెలిపారు.
HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHBలోని ఓ హాస్టల్లో ఉండే యువతి(22)కి 8 నెలల క్రితం డెలివరీ బాయ్ ఒబెదుల్లాఖాన్(23)తో స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
HYDలో దారుణఘటన వెలుగుచూసింది. KPHBలోని ఓ హాస్టల్లో ఉండే యువతి(22)కి 8 నెలల క్రితం డెలివరీ బాయ్ ఒబెదుల్లాఖాన్(23)తో స్నేహం ఏర్పడింది. MAR 28న డిన్నర్ చేద్దామని చెప్పి అమ్మాయిని జూబ్లీహిల్స్లోని OYOకి తీసుకెళ్లాడు. హోటల్లోనే మద్యం తాగి అక్కడే నిద్రపోయారు. మత్తులో ఉన్న ఆమెపై ఒబెదుల్లాఖాన్ అత్యాచారం చేశాడు. శుక్రవారం యువతి PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
భద్రాచలం: మావోయిస్టు పార్టీ పేరిట కరపత్రాలు కలకలం రేపాయి. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కన్నాయిగూడెం వద్ద శనివారం నడిరోడ్డుపై మావోయిస్టులు కరపత్రాలు లభ్యమయ్యాయి. ఈ కరపత్రాల్లో ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే విధంగా దేశ, విదేశీ బహుళజాతి కార్పొరేట్ కంపెనీల మైనింగ్స్, ప్లాంట్లు, రోడ్లు, డ్యాంలు, టైగర్ జోన్లు, అభయారణ్యాలు వంటి ప్రాజెక్టులను నిలిపి వేయాలని ఆ పత్రాలలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.