Telangana

News March 30, 2024

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు గద్వాల జిల్లా కేంద్రంలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా కానాయిపల్లిలో 42.6, నాగర్ కర్నూల్ జిల్లా కిష్టంపల్లిలో 42.4, మహబూబ్ నగర్ జిల్లా సల్కర్‌పేటలో 42.2, నారాయణపేట జిల్లా ధన్వాడలో 41.1, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.

News March 30, 2024

జన్నారంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలోని డీర్ పార్క్ వద్ద ప్రధాన రహదారిపై లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలేరో.. జన్నారం వైపు వస్తున్న బైక్‌ను ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో మందపల్లి గ్రామానికి చెందిన దేవి సుదర్శన్ (45) రక్షిత్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 30, 2024

మెదక్: కాంగ్రెస్ పార్టీలో చేరికకు 5న ముహూర్తం

image

నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి ఏప్రిల్ 5న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం ఇరువురు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరికొంత మంది BRS నేతలు, అనుచరులతో కలిసి 5న గాంధీభవన్‌లో హస్తం కండువా కప్పుకోనున్నట్లు‌ కాంగ్రెస్‌ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News March 30, 2024

కల్వకుర్తి: సీఎంని కలిసిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

image

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం రాత్రి కలిశారు. ఆయన మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో నాగర్ కర్నూల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం సూచించారు.

News March 30, 2024

కాసిపేట: భారీ నగదు స్వాధీనం

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం సోమగూడెం చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న వరంగల్‌కు చెందిన మహేష్ వద్ద రూ.1,20,700/-, జార్పుల అమృ వద్ద రూ.2,75,000/-, దండేపల్లికి చెందిన వెంకటేష్ వద్ద రూ.2,97500/- నగదును స్వాధీనం చేసుకొని SSTటీం ఇన్‌ఛార్జ్‌కి అప్పగించినట్లు ఎస్సై వివరించారు.

News March 30, 2024

మెదక్: రఘునందన్ రావుపై ఈసీకి ఫిర్యాదు

image

బీఆర్ఎస్ నేతలపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. హైదరబాద్‌లోని ఈసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రఘునందన్ రావు పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పరుష పదజాలంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.

News March 30, 2024

NZB: SRSP వద్ద విదేశీ పక్షుల సందడి

image

నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి పక్షుల రాక మొదలైంది.  ప్రతి ఏడాది వేసవిలో విదేశాల నుంచి అరుదైన పక్షులు నీటి కోసం బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తుంటాయి. దాదాపు మూడు నెలల పాటు అవి ఇక్కడ ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా ఛాయ చిత్రకారులు వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతారు.

News March 30, 2024

అభ్యర్థిగా ప్రకటించి నెలవుతున్నా.. కనిపించని నామా..?

image

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీఆర్‌‌ఎస్ అన్ని పార్టీలకంటే ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. నామా పేరును ఖరారు చేసి నెలవుతున్నా ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేదట. కడియం కావ్య ఎఫెక్ట్‌తో కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారంతో నామా పేరు తెరపైకి వస్తోంది. ఆయన పోటీలోనే ఉంటారా? లేక పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది ఖమ్మం బీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైనట్లు సమాచారం.

News March 30, 2024

ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు: MLA

image

కడియం శ్రీహరి ఒక అవకాశవాదని, ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

News March 30, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 200 ఓట్ల మెజార్టీ..?

image

ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ సాధ్యమేనా అనే చర్చ సాగుతుంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800కు పైగా ఓట్లు ఉంటే కాంగ్రెస్‌కు 400 పైచిలుకు ఓట్లు ఉన్నాయి.