India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది నియామకంపై దృష్టి సారించారు. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో సిబ్బంది పాత్రే కీలకం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. వాటికి ఆర్వోలుగా ఆయా జిల్లాల కలెక్టర్లు వ్యవహరించనున్నారు. వారి ఆధ్వర్యంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో కీలకంగా వ్యవహరించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. బియ్యం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నా అధికారులు కట్టడి చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. క్వింటా ధర రూ .7వేలు పలుకుతుంది. గతంలో దొడ్డు బియ్యం వాడకం ఎక్కువగా ఉండగా.. రాను రాను వినియోగం తగ్గిపోయింది. దీంతో సన్న బియ్యం ధరలు అమాంతం పెరిగాయి.
జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి ముద్దాయి మాజీ మంత్రి హరీశ్ రావు అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం మెదక్లో మాట్లాడుతూ.. దుబ్బాక ఉపఎన్నికల సమయంలో తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసి ఇబ్బందుకు గురి చేశారని మండిపడ్డారు. అబద్దాలు ఆడటంలో మామను మించిన వ్యక్తి హరీశ్ రావు అని.. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం అటవీ ప్రాంతంలో రెండు నెలలుగా చిరుతల సంచారం అడవికి సమీపంలో ఉన్న గిరిజన తండా వాసులకు అలజడి రేపుతోంది. తాగునీటి కోసం పులులు రాత్రి సమయాల్లో వస్తుంటాయి. కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని FRO తెలిపారు. భీముని తండా సమీపంలో కేఎల్ఐ కాలువ వద్ద చిరుత పులి రోడ్డు దాటుకుంటూ వెళ్లిందని చెప్పాడు.
ఖిలావరంగల్లో కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాల సంరక్షణను కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గాలి కొదిలేశారని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. పడమరకోట చమన్ కూడలిలోని నివాస గృహాల నడుమ ఉన్న కట్టడంపై ఏపుగా ముళ్ల పొదలు పెరిగాయి. ఫలితంగా రాళ్లు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెట్లు తొలగించి పురాతన కట్టడాన్ని భావితరాలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ జాహ్నవి పై నేడే అవిశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. FEBలో 27మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కి అధ్యక్ష పదవిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుచేయగా ఈనెల 30న బలపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ క్యాంపులో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఏదేమైనా ఏం జరుగుతుందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత గడ్డం అరవింద రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు వస్తున్నా ఆయన నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు కేశవరావుతో ఆయన చర్చలు జరిపారు. కేకే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో అరవిందరెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడం ఖరారైంది.
Sorry, no posts matched your criteria.