India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KNRలో BJPకి బిగ్ షాక్ తగిలింది. మానకొండూర్ మాజీ MLA ఆరెపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్లో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన ఆయన.. శాసనసభ ఎన్నికల్లో BJPలో చేరి, పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం HYDలోని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. MP టికెట్ ఆయనకు కేటాయించనందుకే పార్టీ మారినట్లు సమాచారం.
WGL పార్లమెంట్ BRS అభ్యర్థి విషయంలో రోజుకో కీలక మలుపు కొనసాగుతోంది. సిట్టింగ్ అభ్యర్థి దయాకర్ను కాదని కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. కానీ, తాను పోటీ చేయనని నిర్ణయం తీసుకొని తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో WGL పార్లమెంట్ టికెట్ కేటాయింపుపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇటీవల పార్టీ మారిన బాబు మోహన్, తాటికొండ రాజయ్యతో పాటు పెద్ది స్వప్న పేర్లు వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో అత్యధికంగా 43.3 డిగ్రీలుగా నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. జిల్లాలోని మరో 12 ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 41.5 డిగ్రీల వరకు నమోదుకాగా.. ఎండలకు తోడు వడగాలులు మొదలవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 2 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
పాలమూరులో డీకే అరుణమ్మ గెలవాలి.. దేశ ప్రధానిగా మళ్లీ మోడీ రావాలని అది మీదే బాధ్యతని, బిజెపి ప్రభుత్వం వస్తేనే దేశ సమగ్రత, అభివృద్ధి కాపాడగలుగుతామని, టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి గార్డెన్ లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బిజెపిలో చేరారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు, రాష్ట్ర నాయకులు తల్లోజు ఆచారి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మెదక్ ప్రజల ఆశ, శ్వాసగా పనిచేస్తామని రఘునందన్ రావు తెలిపారు. ఇందిరా గాంధీ హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలుగా కానీ పనులు ఐదేండ్లలో మోదీ నేతృత్వంలో చేసి చూపించామన్నారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపిలు లేకున్నా మెదక్ రైలు, మెదక్ మీదుగా జాతీయ రహదారులు, అనేక పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తా అన్నారు. మెదక్ ఎన్నిక ఏకపక్షమని రఘునందన్ రావు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా గద్వాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM- 4PM మధ్య బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కలుషితమయ్యాయని, జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అన్నారు. ఖమ్మంలో మతోన్మాదానికి చోటు లేదని తెలిపారు. జిల్లాలో కులమత తారతమ్యాలు లేకుండా జీవించే వాతావరణాన్ని కమ్యూనిస్టులు కల్పించారన్నారు. అటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు బీజేపీ దిగుతోందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్లో మారుతున్న రాజకీయ సమీకరణాల పట్ల ములుగు జిల్లా కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడాల్సిన కొందరు ద్రోహులు మాత్రమే పార్టీ వీడుతున్నారని, దీంతో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిపిసిసి చీఫ్ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాదు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించాలని అందుకు కార్యాచరణ పై చర్చించారు. సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి, నిజామాబాద్ నేతలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.